తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల తనయులు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పడప్పుడు వారి సోదరులు కూడా ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాన్ మాస్ ఇమేజ్ సంపాదించుకొని పవర్ స్టార్ అయ్యారు. తాజాగా పెళ్లిచూపులు చిత్రంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా రాబోతున్నాడు.
జీవితా రాజశేఖర్ రెండో కూతురు శివాత్మిక కథానాయికగా 'దొరసాని' సినిమా రూపొందుతోంది. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. మధుర శ్రీధర్ రెడ్డి - యష్ రంగినేని నిర్మిస్తోన్న ఈ సినిమా ద్వారానే, నాయకా నాయికలు పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ ప్రీలుక్ అప్పుడే చిత్రంపై అంచనాలు పెంచేలా చేస్తున్నాయి. కథాకథనాల సంగతి అటుంచితే 'దొరసాని' అనే టైటిల్ ఎక్కువ మార్కులు కొట్టేసింది. జనాన్ని థియేటర్ కి రప్పించే ఇంట్రెస్టింగ్ టైటిల్ ఇది. ఇక థియేటర్లో కూర్చున్న తరువాత మెప్పించవలసిన బాధ్యత దర్శకుడిదే. మహేంద్ర ఏ మాయ చేస్తాడో చూడాలి మరి.