తెలుగు బుల్లితెరపై ‘జబర్దస్త్’ కామెడీ షో ఆరంభం నుంచి సృష్టిస్తున్న టి ఆర్ పి రేటింగ్స్ ప్రభంజమ్ అందరికి తెలిసిందే. ఎన్ని వివాదాలు వచ్చిన ఆ షో కి ఉండే ఫాలోయింగ్ తగ్గదు అని తేలిపోయింది. ఈ షో ద్వారా ఎందరో యువకమెడియన్లు వెలుగులోకి వస్తున్నారు. వీరికి జనాధరణ, పాపులారీటీ, సినిమాలో అవకాశాలు కూడా తలుపుతడుతున్నాయి. ఈ షోకి మొదటి నుంచి నాగబాబు, రోజాలు జడ్జిలుగా ఉన్నారు. 


ఇక ఎన్నికలలో నాగబాబు జనసేన తరపున, రోజా వైసీపీ తరపున పోటీ చేశారు. నాగబాబు ఓడిపోగా రోజా విజయం సాధించింది. తాను ఎన్నికలలో ఎంపీగా గెలిచినా, ఓడినా జబర్ధస్త్‌ని మాత్రం  వదులుకోనని నాగబాబు స్పష్టం చేశాడు. మరోవైపు రోజా గెలవడం, ఆమె పార్టీ వైసీపీ ఏపీలో విజయదుంధుబి మోగించండంతో ఆమెకి మంత్రి పదవి ఖాయమంటున్నారు. అదే జరిగితే రోజా ఇక ఐదేళ్ల పాటు జబర్థస్త్‌లో కనిపించే ఛాన్స్ ఉండదు. ఇక జబర్ధస్త్ షో నుంచి రోజా, నాగబాబు తాత్కాలికంగా తప్పుకోవడంతో జానీమాస్టర్, మీనా, సంఘవి... ఇలా వరుసగా జడ్జిలు మారుతున్నారు.


నాగబాబు మరలా ఈ షోలో పాల్గొనడం ఖాయమని అంటున్న నేపధ్యంలో పవన్‌కి అత్యంత ఆత్మీయుడుగా ఉండి వైసీపీలో చేరిన కమెడియన్ అలీని నాగబాబు స్థానంలో తీసుకుంటున్నారని సమాచారం. మల్లెమాల సంస్థ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటుందో వేచిచూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: