డైలాగ్ కింగ్ సాయి కుమార్ కొడుకు ఆది సాయి కుమార్ హీరోగా తన కెరీర్ మరీ నత్త నడక సాగుతోంది. తన మొదటి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పుడు యంగ్ హీరోగా దూసుకు పోతాడని సినీ ఇండస్ట్రీలో అందరు అనుకున్నారు. కానీ కంప్లీట్ గా అందుకు భిన్నంగా ఆది సాయికుమార్ కెరీర్ సాగుతోంది. కొంత మంది యంగ్ హీరోస్ హీరోగానే కాకుండా నెగిటివ్ క్యారెక్టర్ వచ్చినప్పటికి తమ తోటి హీరోలు నటిస్తున్న సినిమాలలో కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఆదీకి అలాంటి అవకాశం కూడా రావడం లేదు.
అయితే రీసెంట్గా అందరికీ బుర్రకథ చెప్పడానికి సిద్దమవుతున్నాడు. ఈ సినిమా ఆది నటిస్తున్న లేటేస్ట్ సినిమా. ఈ సినిమాలో ఆదికి జోడీగా మిస్తీ చక్రవర్తి, నైరాషా నాయకా నాయికలుగా నటిస్తున్నారు. దీపాల ఆర్ట్స్ బ్యానర్పై హెచ్.కె. దీపాల నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా మాటల రచయిత డైమండ్ రత్నబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రెండు మెదళ్లతో పుట్టిన హీరో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? అనే ఒక డిఫ్రెంట్ కాన్సెప్ట్తో ఈ సినిమా రూపొందింది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది. ఈ మధ్యే 'బుర్రకథ' టీజర్ను విడుదల చేసింది చిత్రబృందం.
దీపాల ఆర్ట్స్ బ్యానర్పై హెచ్.కె. దీపాల నిర్మిస్తున్న ఈ సినిమా ‘‘టీజర్కు పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో పాటు ఫ్యాన్సీ రేటుతో సినిమాకు బిజినెస్ ఆఫర్ కూడా వచ్చిందని సమాచారం. ఈ సినిమా వరల్డ్వైడ్ థియేట్రికల్ రైట్స్ ను వింటేజ్ క్రియేషన్స్ సంస్థ ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకొంది. ఒకవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని లేటెస్ట్ న్యూస్. జూన్లో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.