తెలుగు సినిమా లో ఇప్పటికే బయోపిక్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రముఖుల జీవిత కథలు తెరకెక్కించారు దర్శకులు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా దర్శకుడు మహి  వీ రాఘవ " యాత్ర " సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి హిట్ సంపాదించింది. 

దానిలో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రయాణం లో భాగంగా " యాత్ర 2 " సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యాడు దర్శకుడు రాఘవ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైస్సార్సీపీ ఘనవిజయం సాధించిన సందర్బంగా జగన్ కి శుభాకాంక్షలు తెలుపుతూ " యాత్ర 2 " సంబందించిన హింట్ ఇచ్చాడు దర్శకుడు మహి. తాజాగా యాత్ర 2 సినిమాకు సంబందించి మరింత క్లారిటీ ఇచ్చాడు.


‘వైఎస్‌ రాజా రెడ్డి, వైఎస్‌ జగన్‌ ల గురించి చెప్పకుండా వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కథ పూర్తి కాదు. యాత్ర 2 ఆయన కథను పరిపూర్ణం చేస్తుంది. రాజశేఖర్‌ రెడ్డి యాత్ర తన తండ్రి సమాధి దగ్గర నుండి ప్రారంభమైంది. అలాగే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి యాత్ర కూడా ప్రారంభమైంది’ అంటూ ట్వీట్ చేశారు మహి వీ రాఘవ.అయితే ఈ సినిమా ఎలా తెరకెక్కుతుందనే అనే ఆలోచనలో పడ్డారు కార్యకర్తలు. దర్శకుడు వైఎస్ జగన్ ను తెర మీద ఎలా చూపిస్తాడో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: