ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త హీరోల..కొత్త దర్శకుల జోరు నడుస్తుంది.  కంటెంట్ బాగుంటే..అలాంటి సినిమాలు బాగా ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు వస్తున్న కొత్త సినిమాల్లో బోల్డ్ కంటెంట్ తో పాటు నేచురాలిటీకి దగ్గరగా తీస్తున్నారు.  వాజ్ఞ్మయి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్పణ‌లో విశ్వక్ సేన్ సినిమాస్‌, టెర్రనోవా పిక్చర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ మూవీ నిర్మిస్తున్నాయి. ‘మీడియా 9’ మ‌నోజ్‌కుమార్ కో-ప్రొడ్యూస‌ర్‌. సెన్సార్ స‌హా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా నేడు రిలీజ్ అవుతుంది.

యూఎస్ లో ప్రీమియర్స్ ను కూడా ప్రదర్శించారు. అక్కడి టాక్ ని బట్టి చూస్తే..సినిమాలో విశ్వక్ సేన్ తన డిఫరెంట్ షేడ్స్ తో విజిల్స్ వేయించాడని చెప్పవచ్చు. సినిమాకు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా ప్లస్ అయ్యింది. అనుకోకుండా జరిగే గ్యాంగ్ వార్ ల కారణంగా దాస్ అలాగే అతని అనుచరులు పోలీసులకు చిక్కుతారు.


ఆ తరువాత సినిమా క్రైమ్ పాయింట్ చుట్టూ నడుస్తుంది.  తరుణ్ భాస్కర్ పోలీస్ పాత్రలో ఆకట్టుకోగా పాండు అనే మరో పాత్ర కూడా ఆడియెన్స్ కి నచ్చుతుంది.  నిజమైన రఫ్ అండ్ టఫ్ పోలీస్ స్టైల్ లోనే “ఏందిరా హీరోనా నువ్వు. బాడకొవ్ బటనెయ్” అంటూ సూపర్ పంచ్ ఇచ్చాడు తరుణ్.  కథ కళ్ళముందే జరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. మొత్తానికి ఫలక్‌నుమా దాస్ ఎదో వండర్ క్రియేట్ చెశాలా ఉన్నాడని ప్రవాసులు చెబుతున్నారు. కాకపోతే కొన్ని సీన్లు మాత్రం పరమ బోరింగ్ గా ఉన్నాయని..చెప్పుకోదగ్గ హిట్ సాంగ్ లేకపోవడం కూడా మైనస్ అంటున్నారు.  ఈ సినిమాలో సలోని మిశ్రా, హర్షిత గౌర్, ప్రశాంతి చారులింగ, ఉత్తేజ్ కీలక పాత్రలు పోషించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: