టాలెంటెడ్ డైరెక్టర్స్ కి రెండు డిజాస్టర్స్ వచినప్పటికి మంచి కథ తో మెప్పిస్తే చాలు అగ్ర నిర్మాణ సంస్ఠలు అవకాశం ఇవ్వడానికి ఎప్పుడు ముందుంటాయి. బొమ్మరిల్లు భాస్కర్ తీసిన 'ఆరెంజ్' డిజాస్టర్ అవడంతో చాలా కాలంగా సినిమా అవకాశం కోసం ఎదురు చూశాడు. అయితే ఒక్క సినిమా ఫ్లాప్ తో ఇండస్ట్రీకి టాలెంట్ ఉన్న దర్శకుణ్ణి దూరం చేయకూడనే ఉద్దేశ్యంతో అల్లు అరవింద్ తన బ్యానర్‌లో అవకాశం ఇచ్చారు. అఖిల్ అక్కినేని తో భాస్కర్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్నాడు. ఇక ఇదే అవకాశాన్ని 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి బ్లాక్ బస్టర్ మల్టీ స్టార్ ని తెరకెక్కించిన శ్రీకాంత్ అడ్డాల అందుకున్నాడు. 


సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ అవడంతో మళ్ళీ ఇండస్ట్రీలో శ్రీకాంత్ కి ఎవరూ అవకాశం ఇవ్వలేదు. అయితే శ్రీకాంత్ కి కూడా అల్లు అరవింద్ తన బ్యానర్ లో ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయం. వన్ ఇయర్ నుంచి గీతా ఆర్ట్స్ సంస్థతో ట్రావెల్ అవుతున్న శ్రీకాంత్ అడ్డాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. స్క్రిప్టు కూడా ఫైనల్ అయ్యిందట. ఇక నేచురల్ స్టార్ నానీని లాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారట దర్శక నిర్మాతలు. నాని హీరోగా ఇంతకముందు గీతా ఆర్ట్స్ 2 సంస్థలో 'భలే భలే మగాడివోయ్' లాంటి బ్లాక్ బస్టర్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే అడ్డాల స్క్రిప్టుతో నానీకి సెట్ చేస్తుండడం ఆసక్తిగా మారింది.


ఇక ఈ కథ కంప్లీట్‌గా శతమానం భవతి తరహాలో పూర్తిగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని మరో లేటెస్ట్ న్యూస్. నాని - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో గీతా ఆర్ట్స్ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. నాని ప్రస్తుతం సుధీర్ బాబుతో కలిసి వీ అనే మల్టీస్టారర్ లో నటిస్తున్నారు. దీంతోపాటు సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల-నాని సినిమా సెట్స్ మీదకు ఎప్పుడు వెళుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: