మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, సూపర్ స్టార్ కృష్ణ...వంటి స్టార్స్ తో నటించిన సీనియర్‌ నటి విజయశాంతి మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. దాదాపు 13 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఆమె ఫిల్మ్‌ ఇండస్ట్రీలోకి పునఃప్రవేశం చేయాలని నిర్ణయించుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో మళ్లీ కెమెరా ముందుకు వస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో ఆమె కనిపించనున్నారని లేటెస్ట్ న్యూస్. సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా షూటింగ్‌ను పూజా కార్యక్రమంతో ఇటీవల ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయశాంతి తను నటించబోతున్న కొత్త సినిమా సంగతులను తెలిపారు.


విజయశాంతి...సూపర్‌స్టార్‌ కృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూనే..తెలుగులో నా మొదటి సినిమా కృష్ణతో నటించిన 'ఖిలాడీ' ఆ తర్వాత 150 సినిమాలు చేశాను. రాజకీయాల్లోకి వెళ్లడంతో 13 సంవత్సరాలు సినిమాలకు దూరంగా ఉన్నాను. తొలి సినిమా కృష్ణతో నటిస్తే.. నా రీఎంట్రీలో మొదటి సినిమా ఆయన కుమారుడు మహేశ్‌బాబుతో చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని విజయశాంతి తెలిపారు. 


అనిల్‌ సుంకర, దిల్‌ రాజు, మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను 2020 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు దర్శకుడు అనిల్‌ రావిపూడి తెలిపారు. రష్మిక మందాన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇక 13 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి ఈ సినిమా తర్వాత కూడా కంటిన్యూ గా క్యారెక్టర్స్ చేస్తారా...లేదా అన్న విషయం మాత్రం సస్పెన్స్ గా ఉంచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: