ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ మూవీ ఆర్ఆర్ఆర్. ఇప్పటికే మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు, ఇటీవల రామ్ చరణ్, ఎన్టీఆర్ లు చిన్నపాటి గాయాల పాలవ్వడంతో చిత్ర షూటింగ్ కి కొంత బ్రేక్ పడింది. ఇకపోతే మొన్నటితో గాయాలనుండి పూర్తిగా ఇద్దరు హీరోలు కోలుకోవడంతో, ఇకపై షూటింగ్ ని వేగవంతంగా పరుగులు పెట్టించేలా ప్లాన్ చేశారట రాజమౌళి. ప్రస్తుతం చరణ్, తన భార్య ఉపాసనతో కలిసి విదేశాల్లో ఉండగా, ఆయన తిరిగివచ్చెలోపు ఎన్టీఆర్ తో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. 

ఇకపోతే ఇప్పటికే సినిమాలో ఎన్టీఆర్, చరణ్ కు సంబందించిన ఇంట్రడక్షన్ సీన్స్ ను రాజమౌళి ఎంతో భారీ లెవెల్లో చిత్రీకరించినట్లు సమాచారం. ఇక ఈ సీన్లు అయన హీరోల ఫ్యాన్స్ తో థియేటర్లలో విజిల్స్ వేయించడం ఖాయమని టాక్. ఇకపోతే అన్నిటికంటే ముఖ్యంగా సినిమాలో వచ్చే ఇంటర్వెల్ బ్లాక్ కోసం రాజమౌళి ఎంతో శ్రద్ధ తీసుకుని చిత్రీకరించబోతున్నారని, ఈ బ్లాక్ సినిమాకే పెద్ద హైలైట్ కానుందని సమాచారం. అంతేకాక ఈ బ్లాక్ కోసం ఖర్చు కూడా భారీగానే పెడుతున్నట్లు చెపుతున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే రెండు యాక్షన్ సీన్లు కూడా అదే విధంగా ఆడియన్స్ కి మంచి ఐ ఫీస్ట్ ఇవ్వడం ఖాయమని, అలానే క్లైమాక్స్ కూడా అద్భుతంగా ప్లాన్ చేయడం జరిగినదని తెలుస్తోంది. 

ఇక సినిమాలో హీరో, హీరోయిన్ లతో పాటు నటించే అజయ్ దేవగన్, సముద్రఖని పాత్రలు కూడా చాలా బాగా వస్తున్నాయని, సినిమాలో వారిద్దరి పాత్రలకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుందని సమాచారం. ఇక పాటల విషయంలో కూడా రాజమౌళి ఏ మాత్రం వెనుకాడడం లేదని, సినిమాలో సందర్భానుసారం వచ్చే పాటలు, ఆడియన్స్ ను తప్పక అలరిస్తాయని చిత్ర యూనిట్  అంటోంది. ఇన్నివిధాలుగా భారీ లెవల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం, రేపు విడుదల తరువాత బాహుబలి స్థాయి విజయాన్ని, అలానే కలెక్షన్లను రాబట్టడం ఖాయమని అంటున్నారు సినీ విశ్లేషకులు..!! 



మరింత సమాచారం తెలుసుకోండి: