తెలుగు ఇండస్ట్రీలో హీరోల వారసులు హీరోలుగా వస్తున్న సమయంలో స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి రానా ‘లీడర్’చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు.  మొదటి చిత్రం పొలిటికల్ డ్రామా అయినా మనోడి నటనకు మంచి మార్కులే పడ్డాయి.  ఆ తర్వాత కొన్ని కమర్షియల్ చిత్రాల్లో నటించినా పెద్దగా పేరు తీసుకురాలేదు.  మొదటి నుంచి వైవిధ్యభరితమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకి ప్రాధాన్యతనిస్తూ రానా ముందుకు వెళుతున్నాడు. 

టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు.  హీరో మాత్రమే నటించాలనే రూల్ లేకుండా ఎలాంటి పాత్రలైనా నటిస్తున్నాడు.  రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’సీరీర్ లో భళ్లాలదేవుడు ప్రతినాయకుడి పాత్రలో దుమ్మురేపాడు.  త్వరలో గుణశేఖర్ దర్శకత్వంలో హిస్టారికల్ చిత్రం హిరణ్య కశిప చిత్రంలో నటిస్తున్నాడు.  గత రెండేళ్లుగా 100 మంది టెక్నీషియన్స్ తో కలిసి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు గుణశేఖర్. 

తాజాగా మరో చిత్రానికి సై అంటున్నాడు రానా.  వేణు ఊడుగుల దర్శకత్వం ‘విరాట పర్వం’ చిత్రానికి ఒకే శారు.  ఈ చిత్రం  1920 నేపథ్యంలో ఈ కథ సాగుతుందట.  ఈ చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  జూలై నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలుకానుంది. ఈ సినిమా తన కెరియర్లో ప్రత్యేకమైనదిగా నిలుస్తుందని రానా భావిస్తున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: