లాస్ట్ ఇయరంతా నాగార్జునకి గాని తన కొడుకులిద్దరికిగాని సరైన హిట్ పడలేదు. దీని వల్ల బాక్సాఫీస్ దగ్గర కూడా బాగా వెనకబడిపోయారు. అయితే నాగ చైతన్య సమంత మజిలీతో సూపర్ సక్సెస్ కొట్టడంతో అక్కినేని ఫ్యామిలీలో అందరికి కాస్త ఊరట కలిగింది. అందులోనూ కోడలు సమంతానే మజిలీ హీరోయిన్ కాబట్టి ఆనందం రెట్టింపయ్యింది. ఇక నాగ్ ప్రస్తుతం మన్మధుడు 2 షూటింగ్ ని సమ్మర్‌ను కూడా లెక్క చేయకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ కంప్లీట్ చేయిస్తున్న నాగ్ వీలైనంత త్వరగా  పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసి ఫస్ట్ కాపీ సిద్ధం చేయాలనీ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ను ప్రెజర్ చేస్తున్నాడట.


దాదాపు షుటింగ్ అంతా కంప్లీట్ అయిందట..కొద్దిగా టాకీ పార్ట్ మాత్రమే కంప్లీట్ చేయాల్సి ఉంది. దీంతోపాటు  పాటల చిత్రీకరణ బాలన్స్ ఉంది. సమంత, కీర్తి సురేష్ చేస్తున్న క్యామియోలను కూడా ఆల్రెడీ ఫినిష్ చేశారు. అయితే అసలు సమస్యే ఇప్పుడే మొదలైందని లేటెస్ట్ న్యూస్. అదేంటంటే రిలీజ్ డేట్ విషయంలో నాగ్ టీం ఎటూ తేల్చుకోలేక అవస్థలు పడుతున్నట్టు సమాచారం. వాస్తవంగా ఆగస్ట్ 9న విడుదల చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ కేవలం ఆరు రోజుల గ్యాప్ లో సాహో రిలీజ్ కానుంది. కాబట్టి అంత రిస్క్ చేయడం ఎందుకనే ఆలోచనలో ఎక్కువశాతం శాతం అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో నాగ్ ఆలోచనలో పడ్డట్టు తెలిసింది.  


  సాహో సునామికి ధియేటర్లు వేరే సినిమాలకు దొరకడం కష్టమే. నాగార్జున కు నెట్వర్క్ ఉన్నప్పటికీ ప్రేక్షకులు కామన్‌గా ప్రభాస్ సాహో వైపే మొగ్గు చూపుతారు. అందుకే అది వదిలేసి ఇంకో ఆప్షన్ ఎంచుకునే ఆలోచనలో ఉన్నారట. పోనీ ఆగస్ట్ ఫస్ట్ వీక్ అనుకుంటే శర్వానంద్ రణరంగం కోసం డేట్ ఆల్రెడీ లాక్ అయిపోయింది. సో మూడు లేదా నాలుగో వారానికి షిఫ్ట్ కావడం సేఫ్ గేమ్ అవుతుంది. మరీ ఈ విషయంలో నాగార్జున బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: