గత కొద్ది కాలంగా అన్నీ భాషల్లోను స్పానిష్, కొరియన్..ఇలా వేరే లాంగ్వేజ్ సినిమాలను కాపీ కొట్టడం ఓ హాబీగా తయారైంది. అంతేకాదు రీమేక్స్ అనే ఆప్షన్ ని కూడా ఉపయోగిస్తున్నారు. రీమేక్ అంటే కచ్చితంగా ఒరిజినల్ రైట్స్ దక్కించుకున్నాకే సినిమా స్టార్ట్ చేయాలి. అలా చేయకపోతే దొంగ చాటుగా సినిమాను తీసి రిలీజ్ చేయాలి. కానీ ఇప్పుడు తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఇటువంటివి వ్యవహారాలు చేయడం కష్టమైన పనే. ఒకవేళ కాపీ కొట్టాలని చూసినా వెంటనే దొరికిపోతున్నారు. అందుకే మన మేకర్స్ అఫీషియల్ గా రీమేక్ రైట్స్ కొని రిస్క్ తగ్గించుకుంటున్నారు. 


అప్పటికి ఈ కథ నాది, ఆ దర్శకుడు నా కథను కొట్టేశాడు అంటూ నానా రచ్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇక  ఇప్పుడు అడవి శేషు కూడా తన రీసెంట్ మూవీ ‘ఎవరు’ కోసం అలాంటి ప్రయత్నం ఏమన్నా చేసాడా అనేది హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్ గా అడివి శేష్ 'ఎవరు' అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో పోస్టర్ ని రిలీజ్ చేసాడు. ఈ సినిమాకి వెంకట్ రాంజీ దర్శకత్వం చేసాడు. ఈ సినిమాను ఒక సస్పెన్సు థ్రిల్లర్ గా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా స్పానిష్ లో సూపర్ హిట్ అయిన “The Invisible Guest” సినిమా ఆధారంగా రూపొందుతోందని సమాచారం. 


ఈ సినిమా రైట్స్ కొనుక్కొని కొద్దిగా మార్చి తాప్సీతో బాలీవుడ్‌లో బద్లా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా అక్కడ హిట్ అయింది. మరి ఇప్పుడు తెలుగులో అడివి శేష్ ఈసినిమా రైట్స్ కొని చేసారా... లేక కాపీ చేసారా అనే విషయం ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ ని ఎవరికి తెలియకుండా సీక్రెట్‌గా కంప్లీట్ చేయడం పలు అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇక ఈ సినిమాలో అడవి శేషు సరసన హీరోయిన్ గా రెజీనా కాసాండ్రా నటించింది. ఆగస్టు 23న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర యూనిట్. మరి ఈ రూమర్ పై దర్శక నిర్మాత గానీ హీరో అడవి శేష్ గానీ క్లియర్ క్లారిటీ ఇస్తే బావుంటుంది. లేదంటే ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లడేసుకుంటారు.



మరింత సమాచారం తెలుసుకోండి: