టాలీవుడ్ లోకి ఇప్పటి వరకు ఎంతో మంది స్టార్ హీరోల వారసులు హీరోలుగా పరిచయం అయ్యారు..కానీ చెప్పుకోవడానికి కొద్దిమంది హీరోలు తమ స్థాయి..టాలెంట్ నిరూపించుకొని కొనసాగుతున్నారు.  ఒకప్పడు విప్లవ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న టి కృష్ణ తనయుడు గోపిచంద్ ‘తొలివలపు’సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.  మొదటి సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది..ఆ తర్వాత మూడు సినిమాల్లో విలన్ గా వచ్చిన తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు.

‘యజ్ఞం’ సినిమాతో హీరోగా తన సత్తా ఏంటో చూపించాడు.  పూర్తి యాక్షన్ భరిత సినిమాల్లో నటిస్తూ యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు.   లౌక్యం సినిమాతో మంచి ఫ్యామిలీ హీరో అనిపించుకున్న గోపిచంద్ తర్వాత మళ్లీ యాక్షన్ తరహా సినిమాల్లో నటించడం మొదలు పెట్టాడు.  కానీ వరుసగా అపజయాలు పొందాడు.  ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు 'తిరు'తో ఒక సినిమా చేస్తున్నాడు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.

ఇప్పటికే ఈ సినిమా 50 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమాకి 'బంగారు బుల్లోడు' టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. ఇక కథ విషయానికి వస్తే..తాను ప్రేమించిన అమ్మాయిని పొందడానికి హీరో ఎంతో మందితో పోరాడాల్సి వస్తందట..ఈ క్రమంలో ఆ కుటుంబ సభ్యులతో ఎలా ఎంట్రటైన్ మెంట్ చేశాడు..తన ప్రేమను ఎలా పొందాడు అనే  కథాంశంతో ఈ సినిమా నిర్మితమవుతోందట. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు గోపీచంద్ సరసన అలరించనున్నట్టుగా సమాచారం


మరింత సమాచారం తెలుసుకోండి: