అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా రష్మిక మందన్నా సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. సాధారనంగా త్రివిక్రమ్ సినిమాల్లో ఎప్పుడు రెండో హీరోయిన్ ఉండాల్సిందే. ఈ సెంటిమెంట్ ను త్రివిక్రమ్ ఈ సినిమాకు కూడా ఫాలో అవుతున్నాడు. అతడు, ఖలేజా, జులాయి సినిమాలలో ఈ సెంటిమెంట్ ఫాలో అవలేదు అత్తారింటికి దారేది సినిమా నుండి తన ప్రతి సినిమాలో త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటున్నాడు.

 

ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా చిత్రలహరి ఫేమ్ నివేథా పేథురాజ్ నటిస్తుంది . నివేథాకు తెలుగులో ఇది నాలుగో సినిమా. ఈమె నటించిన మెంటల్ మదిలో , చిత్ర లహరి సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నయి. బ్రొచేదెవరురా అనే సినిమా త్వరలో విడుదల కాబోతుంది. స్టార్ హీరోలతో తెలుగులో నటించటం ఈ హీరోయిన్ కు ఇదే మొదటిసారి.

 

నటనలో మంచి టాలెంట్ ఉన్నా నివేథాకు తగిన గుర్తింపు ఐతే తెలుగులో రాలేదు. ఈ సినిమాల్లో మంచి పాత్ర పడితే నివేథా స్టార్ హీరోయిన్గా మారటం మాత్రం ఖాయం. ఈ సినిమా కనుక హిట్టైతే నివేథా పేథురాజ్ కు మరి కొన్ని సినిమాల్లో ఖచ్చితంగా వస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: