ప్రభాస్ సాహు సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నది. ఆగష్టు 15 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ విషయంలో ఇప్పటికే భారీగా జరిగింది. నైజాంలో సాహు హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ సినిమా కోసం రాజు రూ. 45 కోట్లు ఖర్చు చేశాడు.
అయితే, ఇది కేవలం ఒక్క నైజాం హక్కులకే కాదు.. నైజాం తో పాటు ఇందులో ఉత్తరాంధ్ర హక్కులు కూడా మిక్స్ అయ్యి ఉన్నాయి. ఈ మొత్తంలో తీసుకోవడం ఇంకెవరికి సాధ్యం కాదు. ఆ సాహసం చేయలేరు. కాబట్టి రాజు ధైర్యంగా స్టెప్ వేశాడు. ప్రభాస్ తో సినిమా చేయాలని చాలా కాలం నుంచి రాజు ప్రయత్నం చేస్తున్నాడు.
మొదట్లో సినిమా చేసే అవకాశం వచ్చింది. బాహుబలి తరువాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ప్రభాస్ తో సినిమా చేయాలంటే వందల కోట్లు ఉండాలి. అంతపెద్ద మొత్తంలో పెట్టేందుకు రాజు సిద్ధంగా లేదు. పైగా ప్రభాస్ కు రెండు సొంత బ్యానర్లు ఉండటంతో.. బయట బ్యానర్లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదు.
ప్రభాస్ తో సినిమా ఎలాగో చేయలేకపోతున్నాం కాబట్టి సినిమాకు బదులుగా.. ఇలా డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాడేమో.. అందుకే రాజు.. ఇలా చేసి ఉంటాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం దిల్ రాజు.. మహేష్ తో సరిలేరు నీకెవ్వరూ చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 2020 లో రిలీజ్ కాబోతున్నది.