పూరి జగన్నాధ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు.  ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.  ఈ సినిమాకు సంబంధించిన ప్రచార దృశ్యాలు ఆకట్టుకున్నాయి.  ఇస్మార్ట్ గా సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ కావడంతో సినిమాపై నమ్మకం ఏర్పడింది. రామ్ ఈ సినిమాలో చాలా ఎనేర్జిటిక్ గా కనిపించాడు.  అలాగే నభా నటేష్, నిధి అగర్వాల్ లను కూడా అందంగా చూపించాడు.

పూరి కనెక్ట్ పతాకంపై ఛార్మి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ బయటకు వచ్చింది.  ఈ మూవీ స్క్రిప్ట్  బజ్ బాస్కెట్ గ్రూప్ అడ్మిన్ మురళీ కృష్ణ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి లీక్ చేశాడని దర్శకుడు పూరీ జగన్నాథ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. . దీనిని తొలగించాలని తమ టీమ్ కోరినప్పటికీ.. భారీగా డబ్బు డిమాండ్ చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.  మాములుగా సినిమా రిలీజ్ కు ముందు ఇలాంటి గొడవలు సహజంగా జరుగుతూనే ఉంటాయి.  ఈ గొడవల కారణంగా సినిమాకు హైప్ వస్తుంటుంది.  ఇలాంటి హైప్ కోసమే పూరి ఇలా చేస్తాడని అనుకోవడానికి వీలులేదు. 

జులై 12 న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నది. టెంపర్ తరువాత పూరికి హిట్ లేకపోవడంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  ఈ సినిమా హిట్టయితే.. మరలా లైన్లోకి వచ్చినట్టే.  రామ్ కు కూడా ఈ సినిమా హిట్ కావడం చాలా అవసరం అని చెప్పాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: