చిత్రపరిశ్రమలో కెమెరా ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు రంగు వెసుకోవాల్సిందే. కొన్నాళ్ళకు వారు తమ శరీరంపై మార్పులు రావడంతో వారు ఇంతకుముందులా కనపడటానికి లేదంటే... అంధవిహీనంగా ఉన్నవాళ్ళు అందంగా కనపడటానికి ప్రస్తుతం ప్లాస్టిక్ సర్జరీ చెయించుకుంటున్నారు.  పాతికేళ్ళ క్రితం పాస్టిక్ సర్జరీ అంటే అదేదో హాలీవుడ్ హీరోయిన్లు చేయించుకొనే సర్జరీ అనుకునేవాళ్ళు. అప్పట్లో శ్రీదేవి తన ముక్కుకు సర్జరీ చేయించుకుందని వార్తలు వస్తే అందరూ ముక్కున వేలేసుకున్నారు. కానీ ఈ జెనరేషన్ లో దాదాపు సగం మంది బ్యూటీలవి ప్లాస్టిక్ అందాలే.


బ్యూటీలే కాదు.. కండలు తిరిగిన జెంట్సు కూడా ప్లాస్టిక్ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు.  అయితే తెలుగులో ఒక సామెత ఉంది.. "ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిపోయిందట".. సరిగ్గా అలాగే.. ఉన్న అందం రెట్టింపు చేసుకునే ఉద్దేశంతో సర్జరీ చేయించుకుంటే ఒక్కోసారి అది వికటిస్తుంది. ఇప్పటికే హాలీవుడ్ నుంచి మన టాలీవుడ్ వరకూ ప్లాస్టిక్ సర్జరీ తేడా కొట్టి మొహం అదోలా తయారయిన భామలు లెక్కలేనంతమంది ఉన్నారు. బాలీవుడ్ లో అయేషా టకియాకు అలానే తేడా కొట్టింది. ఇక రాఖి సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 


ఆమె మొహం ఏలియన్ లాగా కనిపించడానికి కారణం ప్లాస్టిక్ సర్జరీలే. ఇదిలా ఉంటే తాజాగా ఒక బాలీవుడ్ భామకు ప్లాస్టిక్ సర్జరీ వికటించిందనే వార్తలు గుప్పుమంటున్నాయి. ఆమె ఎవరో కాదు... మౌని రాయ్. ఎన్నో పాపులర్ టీవీ సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ అక్షయ్ కుమార్ సినిమా 'గోల్డ్' లో హీరోయిన్ గా నటించింది.  ఈ భామ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్.  


ఈమె రీసెంట్ గా సల్మాన్ ఖాన్ సినిమా 'భారత్' ప్రీమియర్ కు హాజరయింది.  కానీ మౌని మొహంలో తేడా కనిపిస్తుండడంతో ప్లాస్టిక్ సర్జరీ వికటించిందని జనాలకు అనుమానాలు వచ్చాయి.  నెటిజనులు మౌనిని తీవ్రంగా ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.  మౌని సాధారణంగా అందంగానే ఉంటుంది. కానీ ఇలా ప్లాస్టిక్ సర్జరీపై ఆధారపడవలసిన అవసరం ఏముందని దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్ పై ఇంకా మౌని స్పందించలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: