ప్రముఖ నటుడు విజయ్ కుమారు కూతురు నటి వనిత మరోసారి వార్తల్లోకి ఎక్కారు.  గతంలో తన చిన్న తనంలోనే సినీ పరిశ్రమకు తనను పరిచయం చేసి తన జీవితం నాశనం చేశారని తండ్రి విజయ్ కుమార్ పై సంచలన ఆరోపణు చేసి వార్తల్లో నిలిచింది వనిత.  ఆ తర్వతా  తన ఇంటిని ఆక్రమించుకుని ఖాళీ చేయమంటే లాయర్లు, రౌడీలతో తన కూతురు బెదిరిస్తోందని నటుడు విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇలా కొంత కాలంగా తండ్రీ కూతుళ్ల మద్య వివాదం నడుస్తూనే ఉంది.   మరోసారి తన కూతురు కేసులో వనిత కోర్టుని ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. వనితకి 14 ఏళ్ల క్రితం హైదరాబాద్ కి చెందిన ఆనంద్ రాజ్ తో వివాహం జరిగింది. వీరికి జెనిత (10) కూతురు పుట్టింది..కొంత కాలం తర్వాత భార్య భర్తలు విడిపోయారు.     2012లో తన కుమార్తెను  చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపించిన వనిత, హైదరాబాద్ లో ఉంటున్న తన కూతురిని తీసుకోచ్చేసింది.

అయితే తనపై లేనిపోని అపనిందలు వేస్తూ తన కూతురు ని దూరం చేసిందని  ఆమె భర్త పోలీసులను ఆశ్రయించారు. తన కుతూరిని వనిత కిడ్నాప్ చేసిందంటూ కంప్లైంట్ చేశాడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు కూతురిని ఆనంద్ రాజ్ కి అప్పగించాలని వనితని కోరారు. ఈ నేపథ్యంలో తన కూతురు విషయంలో కోర్టుని ఆశ్రయించింది వనిత.

నవమాసాలు మోసి కన్న తన కూతురు పై హక్కు లేదని చెప్పడం న్యాయం కాదని..తన కూతురుపై పూర్తి హక్కుని తనకు అప్పగించాలని కోరుతూ కోర్టులో పిటిషన్ వేసింది. అయితే ఈ కేసు విచారణ సమయంలో ఆనంద్ రాజ్ హాజరు కాకపోవడంతో తీర్పుని రిజర్వ్ లో ఉంచింది కోర్టు. 


మరింత సమాచారం తెలుసుకోండి: