టాలీవుడ్ లోకి మంచు మనోజ్ నటించిన ‘ఝమ్మంది నాథం’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ తాప్సీపొన్ను. మొదటి సినిమాలో తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మనసు తనవైపునకు తిప్పుకుంది. ఈ సొట్టబుగ్గల సుందరి తాప్సీకి ప్రారంభంలో సక్సెస్ అంత త్వరగా రాలేదు..వరుసగా నటించిన సినిమాల్లో గ్లామర్ ప్రదర్శన చేసినా పెద్దగా రాణించలేక పోయింది. అయితే హీరోయిన్ గా తన క్రేజ్ ని కాపాడుకుంటూ వచ్చిన తాప్సీ తర్వాత తమిళ, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం తాప్సీ ఎక్కువగా బాలీవుడ్ మూవీస్ లోనే నటిస్తుంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాప్సీ తాను అద్దె ఇంటి కోసం ఎన్ని ఇబ్బందులు పడితో తెలిపింది. సినిమాల్లో నటించాలని ఢిల్లీలో నా తల్లిదండ్రులని వదలిపెట్టి ముంబై వచ్చా. ముంబైలో నాకు అద్దె ఇల్లు దొరకడానికి నెల రోజుల సమయం పట్టింది. ప్రజలు టికెట్ కొనుక్కుని మమ్మల్ని చూడటానికి వస్తారు. కానీ.. వారితో మేం ఉండటానికి ఇష్టపడరు. తమ గురించి కొంతమంది ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారో అర్థం కాదు అని తాప్సి తెలిపింది.
హైదరాబాద్ తన సొంత ఊరు ఢిల్లీ లాగే అనిపించిందని తాప్సి తెలిపింది. తనకు హైదరాబాద్ లో ఎలాంటి ఇబ్బంది కలగలేదని అన్నారు. హైదరాబాద్ నాకు ఎంతగానో నచ్చింది. చాలా తక్కువ సమయంలోనే హైదరాబాద్ పరిస్థితులకు అలవాటు పడిపోయా. ప్రస్తుతం నేను, నా చెల్లి ఓ అపార్ట్మెంట్ లో సంతోషంగా ఉంటున్నాం అని తాప్సి తెలిపింది. మా తల్లిదండ్రులు డిల్లీలో ఉంటారని చెప్పింది. మొత్తానికి సామాన్యులకే కాదు అద్దె కష్టాలు హీరోయిన్లకు కూడా ఉన్నాయన్న నిజం తాప్సీ ద్వారా తెలిసిందని అంటున్నారు నెటిజన్లు.