‘చిత్రం’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన తేజ రెండో సనిమా ‘జయం’తో మంచి విజయం అందుకున్నారు.   అప్పటి నుంచి తేజ మంచి ప్రేమ కథా సినిమాలు అందిస్థారని అందరూ అనుకున్నారు.  కానీ అందరూ అనుకున్నట్లు తేజ అలాంటి సినిమాలు కాకుండా యాక్షన్, మెసేస్ ఓరియెంటెడ్ సినిమా తో అభిమానులకు సర్పైజ్ ఇవ్వాలని అనుకున్నారు.  మహేష్ బాబు తో ‘నిజం’లాంటి సినిమా తీశారు.  ఈ సినిమాలో గోపిచంద్ విలన్ గా నటించారు. లంచగొండి తనపై ఈ సినిమాలో మెసేజ్ ఉన్నా..ఆడియన్స్ మాత్రం కనెక్ట్ కాలేదు.


మహేష్ కెరీర్ లో అదో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. అప్పటి నుంచి తేజ- మహేష్ ల మద్య వివాదం తలెత్తిందని రక రకాల కథనాలు వచ్చాయి. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు.  ఈ మద్య తేజ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. రానాతో ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు.  ఈ మద్య కాజల్ లీడ్ రోల్ లో వచ్చిన ‘సీత’సినిమా ఫ్లాప్ అందుకున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.  


నేను తీసిన సినిమాల్లో ‘నిజం’ ఓ మంచి మెసేజ్ సినిమా.  అయితే ఈ సినిమాలో నటించిన మహేష్ బాబు కి కూడా మంచి పేరు వచ్చింది.  కాకపోతే ఈ సినిమాకు ముందు ‘ఒక్కడు’సినిమా వచ్చింది.  ఈ సినిమా మహేష్ బాబు స్టైల్, కెరీర్ పూర్తిగా మార్చింది. ఒక్కడు సినిమా ఎఫెక్ట్ నిజంపై పడడం వల్ల ప్లాప్ అయింది. నిజం కంటే ముందుగా ఒక్కడు విడుదలయింది.  నిజం ప్లాప్ కావడం వల్ల నాకు, మహేష్ కు గొడవలు జరిగాయని ఏవేవో వార్తలు వచ్చాయి. వాస్తవానికి మహేష్ కు, నాకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తేజ వివరణ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: