దగ్గుబాటి రానా విలక్షణ నటుడు. బాహుబలి సినిమాతో తనలోని విలనిజాన్ని బయటపెట్టాడు.  నిజమైన నటుడు కేవలం హీరోగా మాత్రమే కాదు అవసరమైతే విలన్ గా కూడా నటించాలి.  మెప్పించాలి.  దానిని రానా సమర్ధవంతంగా చేస్తున్నాడు కాబట్టి ఆయనకు సినిమాలు వస్తున్నాయి.  


ఇప్పుడు రానా కోసం తెలుగులో ఓ భారీ ప్రాజెక్ట్ రెడీ అవుతున్నది.  అదే హిరణ్య కశ్యప.  పురాణాల్లో విలన్.  హిరణ్య కశ్యప వంటి విలన్ ను ఎప్పుడు చూసి ఉండరు.  అలాంటి పురాణ పురుషిని కథతో గుణశేఖర్ సినిమాను సిద్ధం చేశాడు.  ఈ సినిమా కోసం మొదట 50 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుంది అనుకున్నారు.  కానీ, తరువాత 100 కోట్లు అవుతుందని అనుకున్నారు.  


భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబటి మొత్తంగా రూ. 200 కోట్ల రూపాయల బడ్జెట్ అవుతుందని ఎస్టిమేట్ వేశారట.  ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ జరుగుతున్నాయి.   త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.  


రానాతో పాటు ఇందులో ఎవరెవరు నటిస్తున్నారు అనే విషయాలు త్వరలోనే తెలుస్తుంది. రానాను నమ్మి అంత బడ్జెట్ ను పెడుతున్నారు.  ఈ సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది.. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయాలను త్వరలోనే ప్రకటిస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: