సాయి పల్లవి టాలీవుడ్ లో బెస్ట్ హీరోయిన్ .. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఫిదా సినిమాతో ఆమె టాలీవుడ్ మొత్తానికి పరిచయం అయ్యింది. హైబ్రిడ్ పిల్లగా అల్లరి చేసిన ఈ భానుమతి.. ఎందరో మతులను పోగొట్టింది. తరువాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా ఆకట్టుకోలేదు.
టాలీవుడ్ లో మారి2సినిమాతో మళ్ళీ లైన్లోకి వచ్చింది. ఆ సినిమా ఫెయిల్ అయ్యినా సాంగ్ మాత్రం సూపర్ హిట్టైంది. అయితే ఈ అమ్మడికి నటన అంటే ఎలా ఉంటుందో ఎలా చేయాలో తెలియదట. ఒక్కసారి సెట్స్ లోకి వెళ్ళాక.. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేస్తుంది.
డైరెక్టర్ చెప్పిన ఇంస్ట్రుక్షన్స్ ఫాలో కావడం ఒక్కటే తెలుసు. అది నటన అని తనకు తెలియదని చెప్తోంది. నేను ఓ సన్నివేశం చేయాల్సి వచ్చినప్పుడు ప్రతిదాన్నీ మరిచిపోయి ఖాళీగా సెట్స్పైకి వెళతా. నా చుట్టూ ఏం జరుగుతుంది. నన్ను ఎవరు చూస్తున్నారన్న విషయాలను పట్టించుకోను. నేను, నేను చేయాల్సిన పాత్ర మాత్రమే అక్కడ ఉంటాయి అని సెలవిచ్చింది.
డైరెక్టర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవడం వలనే ఈ అమ్మడికి అవకాశాలు వస్తున్నాయి. కమర్షియల్ యాడ్స్ లో నటించే అలవాటు లేదు. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ కోసం రెండు కోట్లు అఫర్ చేసినా వద్దని చెప్పి పక్కన పెట్టేసింది సాయి పల్లవి.