విజయశాంతి అలియాస్ రాములమ్మ సరిలేరు నీకెవ్వరు సినిమా తో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. 13 ఏళ్ల గ్యాప్ తర్వాత మహేష్ కథానాయకుడిగా నటిస్తోన్న ప్రతిష్టాత్మక సినిమాతో ఎంట్రీ షురూ చేసారు. ఇందులో రాములమ్మ మహేష్ తల్లి పాత్రలో కనిపించ నున్నారు. అతి త్వరలోనే షూటింగ్ లో జాయిన్ కానున్నారు. మరి ఇంతకీ ఈ సినిమాకు రాములమ్మ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? మార్కెట్ లో ఆమె క్రేజ్ తగ్గిందా? పెరిగిందా? అంటే ఆమెలో గ్రేస్ ..క్రేజ్ రెండు ఏ మాత్రం తగ్గినట్లు కనిపించలేదని తాజా సన్నివేశం చెబుతోంది. ఈ సినిమాకు రాములమ్మ అక్షరాలు కోటి రూపాయలు ఛార్జ్ చేస్తున్నారుట. నమ్మడం కష్టమే అయినా….నమ్మక తప్పని నిజమిది.
ఫామ్ లో ఉన్న హీరోయిన్ కే అంత ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచిస్తారు? అలాంటిది విజయ శాంతికి కోటి అంటే నిర్మాతలు ఎలా కన్వెన్స్ అయ్యారనే సందేహం రావడం సహజం. కానీ రాములమ్మ మార్కెంట్ రేంజ్ వేరు. ఫేమ్ లో ఉన్నప్పుడే ఎన్నో లేడీ ఓరియేంటెడ్ సినిమాలు చేసి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటిన నటి. ఆ విషయంలో రాములమ్ను కొట్టిన నటి ఇప్పటివరకూ రాలేదు. ఆమె వయసున్న కథానాయికలు చాలా మంది ఆమె ఛరిష్మాను అందుకోవడానికి ప్రయత్నాలు చేసిన సఫలం కాలేదు. ఆ విషయంలో రాములమ్మను ఆదరించినతంగా తెలుగు ప్రేక్షకులు మరోకర్ని ఆదరించలేదు. ఇక రాజకీయ నాయకులి రాలిగాను ఆమెది సుధీర్ఘ ప్రస్థానం.
సినిమాలు..రాజకీయాలు అంటూ రోజాలా రెండు పడవల ప్రయాణం ఏనాడు చేయలేదు. ఉన్నంత కాలం రాజకీయాలకే అంకితమయ్యారు. సినిమా అవకాశాలు వచ్చినా నటించలేదు. ఆ విధంగా ఆమె కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకున్నారంటే? ఆమెలో పొలిటికల్ కమిట్ మెంట్ ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతోంది. సినిమాల్లో ఉంటూ చాలా మంది రాజకీయాలు చేసారు. కానీ ఏ ఒక్కరికీ రాని గుర్తింపు విజయశాంతికి దక్కింది. కారణం ఆమె డెడికేషన్…కమిట్ మెంట్ మాత్రమే. అందుకే ఆమెకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పుడా ఆ ఐడెంటిటీనే కారణంగానే ఆమె అడిగినంత పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు దిల్ రాజు, అనీల్ సుకంర ముందుకొచ్చారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.