పూజా హెగ్డే ముకుంద సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ బాగుంది కానీ తరువాత చేసిన సినిమాలు వరసగా ఫ్లాప్ అయ్యాయి. తరువాత అల్లు అర్జున్ డీజే సినిమాతో తిరిగి లైన్లోకి వచ్చింది. అందులోని హాట్ బినికితో అవకాశాలు దక్కించుకుంది.
సినిమా యావరేజ్ గా నిలిచినా టాప్ హీరోల సినిమాలో అవకాశం దక్కించుకోవడానికి వీలు దొరికింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ అరవింద సమేత సినిమాలో నటించింది. నటనతో మాత్రమే కాకుండా డబ్బింగ్ చెప్పి మెప్పించింది. సినిమా హిట్ తరువాత మహర్షి వంటి బ్లాక్ బస్టర్ లో అవకాశం పొందింది.
ప్రభాస్ తో జాన్ సినిమా చేస్తున్న ఈ అమ్మడు.. ఈ సినిమా అల్లు అర్జున్ 19 వ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఇక్కడితో ఆమె జైత్రయాత్ర ఆగలేదు. ముందుకు సాగుతూనే ఉన్నది. ప్రస్తుతం ఈ అమ్మడు హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న వాల్మీకి సినిమాలో అవకాశం దక్కించుకుంది.
ఈ సినిమాలో పాత్ర చిన్నదే అయినా.. దర్శక నిర్మాతలు పట్టుబట్టడంతో కాదనలేక ఒకే చేసింది. పాత్ర చిన్నదే అయినప్పటికీ దీనికోసం ఏకంగా 2 కోట్ల రూపాయల పారితోషికం అడిగిందట. ఆమె అడిగినంత ఇచ్చేందుకు దర్శక నిర్మాతలు కూడా సిద్ధంగా ఉన్నారు.