మారుతి దర్శకత్వంలో సుదీర్ బాబు నటించిన ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమాలో తనదైన కామెడీ మార్క్ చాటుకున్నాడు. దాంతో సప్తగిరికి వరుసగా కమెడియన్ గా ఛాన్సులు వచ్చాయి. అంతే కాదు అదృష్టం మరొమెట్టు ఎక్కి హీరోగా అయ్యే ఛాన్సు వచ్చింది. దాంతో ఇప్పుడు సెకండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టు గా ఎన్నో పాత్రల్లో నటిస్తున్నాడు. ఆ మద్య వచ్చిన సప్తగిరి ఎక్స్ ప్రెస్ మంచి విజయం అందుకున్నా..తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం హిట్ కాలేదు.
ప్రస్తుతం సప్తగిరి హీరోగా నిలదొక్కుకోవడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. సప్తగిరి తాజా మూవీ రూపొందిన 'వజ్రకవచధర గోవింద' ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సప్తగిరి మాట్లాడుతూ..తాను కమెడియన్ గా వెండి తెరకు పరిచయం అయినా..తనను హీరోగా తెలుగు ప్రేక్షకులు ఆదరించారని..వారికి ఎప్పటికీ కృతజ్ఞుడినే అన్నారు.
'వజ్రకవచధర గోవింద' మూవీ గురించి మాట్లాడుతూ..బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇది చాలా చిన్న సినిమా. కానీ కథాకథనాల పరంగా చూసుకుంటే పెద్ద సినిమా. 'వజ్రకవచధర గోవింద' సినిమాకి డబ్బు — పేరు రెండూ వస్తాయనే నమ్మకం వుంది. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ కావాలనీ, ఈ నిర్మాతలు నాతో మరిన్ని సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మూవీలో సప్తగిరి సరసన వైభవీ జోషి నటిస్తుంది.