టాలీవుడ్లో సూపర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోంది. దివంగత హీరో రియల్స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా, సీనియర్ నట దంపతులు జీవిత, రాజశేఖర్ కుమార్తె శివానీ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోంది. తొలి సినిమా రిలీజ్ కాకుండానే మేఘాంశ్ శ్రీహరికి మరో రెండు అవకాశాలు రావడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
శ్రీహరి నటవారసుడు మేఘాంశ్ నటిస్తున్న తొలి సినిమా `రాజ్ దూత్` ఫస్ట్ లుక్తో పాటు టీజర్ ఆకట్టుకున్నాయి. ఇక శ్రీహరి - శాంతి దంపతులకు జీవితా రాజశేఖర్ ఈ టీజర్ను స్వయంగా ఆవిష్కరించారు. ఈ ఈవెంట్లోనే మేఘాంశ్ని మీడియాకి పరిచయం చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో జరిగిన మేఘాంశ్ పరిచయ కార్యక్రమంలో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ పలు ఆసక్తికర సంగతుల్ని వెల్లడించారు.
ఇక ఇదే వేదికపై మేఘాంశ్ తొలి సినిమా నిర్మిస్తున్న ఎం.ఎల్.వి సత్యనారాయణ మేఘాంశ్ హీరోగా తర్వాతి సినిమాని నిర్మిస్తున్నామని ప్రకటించారు. మేఘాంశ్ రాజ్ దూత్ వచ్చే నెలలో రిలీజ్ అవుతోంది. ఇక జీవిత మాట్లాడుతూ మేఘాంశ్ - శివాత్మిక జంటతో సినిమా తీసేందుకు ఓ నిర్మాత ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా అంటే చాలా ఇంట్రస్టింగ్గానే ఉంటుంది.. ఈ క్రమంలోనే ఇది టాలీవుడ్లో హాట్ టాపిక్ కూడా అవుతుందనడంలో సందేహం లేదు.