దువ్వాడ జగన్నాథం తర్వాత హరీష్ శంకర్ నుండి ఏ సినిమా రాలేదు. రెండు మూడు సార్లు కొన్ని ప్రాజెక్ట్స్ అనుకున్నప్పటికి అవి కార్య రూపం దాల్చలేదు. అయితే హరీష్ కి తమిళ సినిమా రీమెక్ చేసే అవకాశం వచ్చింది. గతంలో పవర్ స్టార్ తో తెరకెక్కిన గబ్బర్ సింగ్ కూడా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ దబాంగ్ కి రీమేక్. ఈ సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించాడు. ఈ సినిమాని హరీష్ శంకర్ పవర్  తో తీసి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇచ్చాడు. ఇప్పుడు వరుణ్ తేజ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా వాల్మీకి. ఈ సినిమాకు డేట్ ను లాక్ చేస్తునట్టు లేటెస్ట్ న్యూస్. సెప్టెంబర్ 6న విడుదలకు ముహుర్తం పెట్టినట్టు సమాచారం. 14రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న వాల్మీకిని తమిళ సూపర్ హిట్ సినిమా జిగర్తాండ రీమెక్ గా తెరకెక్కిస్తున్నారు. 


వరుణ్ తేజ్ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ కాస్త నెగిటివ్ షేడ్ వున్న రఫ్ క్యారెక్టర్ ను పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో వరుణ్ లుక్ ని రిలీజ్ చేయగా ఆ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. వరుణ్ ఎన్నో అంచనాలు పెట్టుకున్న అంతరిక్షం ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా వరుణ్ కి సూపర్ హిట్ ని ఇస్తుందని ఫుల్ కాన్‌ఫిడెంట్‌గా ఉన్నాడట వరుణ్ తేజ్. ఇక హరీష్ శంకర్ డిజె సినిమా తరువాత మళ్లీ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇదే.  అందువల్ల ఈ సినిమా మీద కాస్త మంచి అంచనాలే వున్నాయి. అంతేకాదు హరీష్ కి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ సినిమాతో హరీష్ ఖచ్చితంగా హిట్ కొట్టాలి.


ఇక వరుణ్ తేజ్ కూడా తను గీతాలో చేయాలనుకున్న స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీని వెనక పెట్టి, ఈ సినిమా ముందు చేసారు. అంటే ఈ సినిమా మీద ఎంత నమ్మకంగా ఉన్నారో అర్థమవుతుంది. దేవీశ్రీప్రసాద్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మిక్కీ జె మేయర్ వచ్చి చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాకీ షూట్ చివరిషెడ్యూలుకు రెడీ అవుతున్న ఈ సినిమా ముందు అనుకున్నదానికంటే ముందుగానే రెడీ అయిపోతుందని, అయితే ఆగస్టులో ఖాళీ లేక, సెప్టెంబర్ కు ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. ఇక తమిళ హీరో అధర్వ మురళి కీలకపాత్ర పోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: