సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్లో 25వ సినిమా మహర్షిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలని సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ వంశీ పైడిపల్లి కి ముందే తెలియజేశారట మహేష్. అయితే అందరూ అనుకున్నట్టుగానే సినిమాని సమ్మర్ కానుకగా విడుదల చేసి మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.


ప్రస్తుతం ఈ సినిమాకి వస్తున్న కలెక్షన్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో పాటు ఇంకా విడుదలైన అనేక చోట్ల రికార్డులను పగలగొడుతు కొత్త రికార్డులను సృష్టిస్తోంది. మహేష్ బాబు అంటే మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగా ఇష్టపడతారు. ఇటువంటి నేపథ్యంలో మహర్షి సినిమాకి ఎక్కువగా మాస్ ప్రేక్షకులకు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఆదరిస్తున్నారు.


అయితే సినిమా నిడివి కాస్త పెద్దది కావడం మరియు మాస్ ఎలివేషన్ సీన్స్ మోతాదు కూడా తక్కువ ఉండడం మహేష్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించాయి.ఈ మాస్ ఆడియన్స్ కు కూడా సంబంధించి కొంచెం డోస్ పెంచి కానీ కొన్ని సీన్లు కట్ చేసి ఉంటే ఆ రిజల్ట్ ఇంకోలా ఉండేదని చెప్పాలి.అప్పుడు మరింత ఎక్కువ స్థాయిలో క్రౌడ్ పుల్లర్ గా మహేష్ మారి ఉండేవారు.ఓన్లీ సాఫ్ట్ ఆడియన్స్ ఎక్కువగా వీక్షించిన ఈ సినిమాకు మాస్ ఆడియెన్స్ కూడా తోడైతే మాత్రం ఓవరాల్ గా కూడా నాన్ బాహుబలి రికార్డులు కొట్టేదని మహేష్ అభిమానులు అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: