తమిళ్ హాస్య నటుడు వడివేలు కమెడియన్ నుంచి హీరోగా మారిన తరువాత అనేక సినిమాలు చేశాడు.  అందులో ఒకటి 23 వ పులకేశి.  ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.  దీని తరువాత ఇంసై అరసన్ 24 ఏంఎ పులకేశి అనే సినిమా ప్రారంభించారు.  కొన్ని కారణాల వలన సినిమా ఆగిపోయింది.  


ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది అనే దానిపై అనేక అనుమానాలు వచ్చాయి.  శింబు తనకు స్వేచ్ఛను ఇవ్వడం లేదని, సినిమాను బలవంతంగా ముందుకు తోస్తున్నారని వడివేలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.   అసలు తాను లేకుండా శింబు సినిమా చేయలేడని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 


దీనిపై శింబు సహాయ దర్శకుడు, ‘మూదర్‌ కూదమ్‌’ దర్శకుడు నవీన్‌ స్పందించాతప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. ‘సెట్‌లో నటన పరంగా మీ నైపుణ్యం అంటే నాకు ఎంతో ఇష్టం. మీరు ఓ నటుడిగా నిజాయితీగా ఉంటారు. హాస్యాన్ని బాగా పండించగలరు.   


మొత్తం సినిమా స్క్రిప్టును మీరు రాయలేరు  ‘ఇంసై అరసన్’ సినిమా విజయానికి నిజంగా మీరు కారణమైతే.. మిగతా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో చెప్పాలని అన్నారు.  నవీన్ స్పందించిన తీరును శింబు వర్గం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: