సమంత బెస్ట్ నటి.  అందులో సందేహం లేదు.  ఆమె ఎలాంటి పాత్రలోనైనా ఐటీ ఒదిగిపోయి నటించగలదు.  అందుకే ఆమె సినిమాలకు టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్నది.  నాగ చైతన్యతో వివాహం తరువాత కూడా అనేక సినిమాలు చేసింది.  ప్రస్తుతం ఆమె ఓ బేబీ సినిమా చేస్తోంది. 


ఇందులో నాగశౌర్య ముఖ్యపాత్ర చేస్తున్నాడు.  ఆయనతో రొమాన్స్ చేయడం చాలా కష్టం అంటోంది సమంత.  వీరిద్దరు కలిసి నటించిన సినిమా 'ఓ బేబీ'. నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నుండి 'నాలో మైమరపు..'ను జూన్‌ 10న సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు సమంత ప్రకటించారు.


ఈ మేరకు సినిమాలో నాగశౌర్యతో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ.. 'ఇది సులభమైంది కాదు. నాగశౌర్యతో రొమాన్స్‌ సీన్లు చేయించడం కోసం ఎంత కష్టపడ్డామో నాకు, నందిని రెడ్డికి మాత్రమే తెలుసు" అని ఎమోజిలు పెట్టారు. దీన్ని చూసిన నాగశౌర్య బదులిచ్చారు. 'ఈ పాట కోసం నాలోని రొమాంటిక్‌ కోణాన్ని బయటికి తీసినందుకు నిన్ను ప్రశంసిస్తున్నా సమంత' అని పోస్ట్‌ చేశాడు.


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యింది.  ఇప్పుడు మరో సాంగ్ రిలీజ్ కు సిద్ధం అవుతుండటం విశేషం.  కొరియన్ సినిమా మిస్ గ్రానీ సినిమాకు ఇది రీమేక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: