బాలీవుడ్ లో సీక్వెల్ సినిమాలు వరసగా వస్తున్నాయి. సినిమా ఎలా ఉన్నా కూడా సీక్వెల్ సినిమాలకు డిమాండ్ ఉండటంతో ఈ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటె ఇప్పుడు బాలీవుడ్ లో మరో సీక్వెల్ రెడీ అవుతున్నది.
'బాఘి, 'బాఘి 2' బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకున్నాయి. ఇప్పుడు దాని ఫ్రాంచైజ్లో భాగంగా మూడో భాగాన్ని రూపొందించేందుకు కరసత్తు చేస్తున్నారు. 'బాఘి3' త్వరలో సెట్స్పైకి వెళ్లబోతుంది. ఈ చిత్రంలో మళ్లీ టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూరే హీరో హీరోయిన్లుగా మెప్పించబోతున్నారు.
అయితే ఈ సారి మాత్రం ఈ టీమ్లో రితేశ్ దేశ్ముఖ్ కూడా పాల్గొనబోతున్నాడు. ఈ మూడో ఇన్స్టాల్మెంట్లో భారీ ఎత్తున పోరాట సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. దీనికి సంబంధించి టైగర్ ష్రాఫ్ ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నారు. రితేశ్ ఓ ముఖ్య పాత్రలో ఇందులో కనిపించబోతున్నాడు.
ఇప్పటి వరకూ చూడని పూర్తిస్థాయి యాక్షన్ రివేంజ్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అందులో ఇందులో రితేశ్, టైగర్ ష్రాఫ్ విభిన్నమైన అవతారల్లో కూడా కనిపించబోతున్నారట. మొత్తంగా నాలుగు దేశాల్లో ఈ సినిమాని చిత్రీకరించబోతున్నారు.
ఈ చిత్రానికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాడి మార్చి 6వ తేదీన ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. శ్రద్దా కపూర్ సాహో సినిమా చేస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఆగష్టు 15 వ తేదీన సినిమా రిలీ కాబోతున్నది.