అక్షయ్ కుమార్ వరసగా సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నాడు.  ఇప్పుడు ఈ హీరో కన్ను రౌడీ రాధోడ్ సినిమాపై పడింది.  తెలుగులో సూపర్ హిట్టైన విక్రమార్కుడు సినిమాకు ఇది రీమేక్.  రౌడీ రాథోడ్ హిట్ కొట్టడంతో ఇప్పుడు దానికి సీక్వెల్ చేసేందుకు ఈ హీరో రెడీ అవుతున్నాడు.  


బాలీవుడ్ లో ఇప్పుడు సీక్వెల్ చిత్రాలు వరసగా వస్తున్న సంగతి తెలిసిందే.  ‘కిక్‌ 2’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘దబాంగ్‌ 3’ ఇలా వరసపెట్టి సీక్వెల్స్‌ తెరపై సందడి చేయబోతున్నాయి. వీరి సరసన రౌడీ రాధోడ్ 2 కూడా చేరబోతున్నది.  రోది రాధోడ్ సినిమాకు ప్రభుదేవా దర్శకత్వం వహించాడు.  


ఇప్పుడు ఈ సీక్వెల్ సినిమాకు కూడా ఆయనే దర్శకత్వం వహించబోతున్నారు.  ఈ విషయంపై ప్రభుదేవా స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. ‘‘రౌడీ రాథోడ్‌’ సీక్వెల్‌కు కథ సిద్ధం చేస్తున్నాం. ఇందులో అక్షయ్‌కుమార్‌ నటిస్తారు’’ అని ప్రభుదేవా మనసులో మాట బయటపెట్టినట్టు బాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 


రౌడీ  రాధోడ్ ఫస్ట్ పార్ట్ లో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా చేసింది.  సెకండ్ పార్ట్ లో ఎవరు హీరోయిన్ గా చేస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.  ఆమెనే తీసుకుంటారా లేదంటే కొత్త హీరోయిన్ ను తీసుకుంటారా అన్నది తెలియాలి.  వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: