ఈ సంవత్సరం వచ్చిన సినిమాల్లో టాప్ పొజీషన్లో రికార్డులు బ్రేక్ చేసింది..మహేష్ బాబు నటించిన ‘మహర్షి’.  వంశి పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమా రైతులు పడుతున్న ఇబ్బందులు..వారిని కామన్ మాన్ ఎలా గౌరవించాలి అన్న విషయంపై ఎంతో చక్కగా వర్ణించి తీశారు ‘మహర్షి’.   ఈ సినిమాలో ఒక సామాన్య కాలేజ్ విద్యార్థి ఒక బిలీనియర్ ఎలా అయ్యాడు..తర్వాత రైతు బంధుగా మారిన విధానం వంశి పైడిపల్లి చక్కగా చూపించారు. 

సాధారణంగా ఏ సినిమా విజయం సాధించినా..సాధించక పోయినా, మహేష్ బాబు తన ఫ్యామిలీతో విదేశాల్లో టూర్ కి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేయడం చూస్తూనే ఉన్నాం.  ఈ సంవత్సరం కూడా మహేష్ బాబు విదేశాల్లో తన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం వరల్డ్ కప్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో నిన్న ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో మహేష్ బాబు తన ఫ్యామిలీతో వరల్డ్ కప్ మ్యాచ్ ను కూడా సెలబ్రేషన్స్ లో భాగం చేశాడు.

ఈ ఫోటో లో భార్య పిల్లలతో మ్యాచ్ చూస్తూ కనిపించిన మహేష్ ఈ విధంగా వంశీ పైడిపల్లికి సెల్ఫీ స్టిల్ ఇచ్చాడు. విదేశ ప్రయాణాల్లో భాగంగా జర్మనీ నుంచి మహేష్ లండన్ కి వెళ్లారు. అక్కడ మ్యాచ్ చూసినా అనంతరం మళ్ళీ ఇండియాకి రానున్నాడు. వచ్చిన వెంటనే మహేష్ అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టనున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: