బిగ్ బాస్ సీజన్ 3 పై స్పెషల్ అప్డేట్ అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 రెడీ అవుతుంది. అయితే ఈ సీజన్ లో కంటెస్టంట్స్ గా క్రేజీ సెలబ్రిటీస్ వస్తున్నారట. బిగ్ బాస్ 1,2 లలో కన్నా ఈ సీజన్ లో ఎక్కువ మంది ప్రేక్షకులకు బాగా తెలిసిన వారిని సెలెక్ట్ చేస్తున్నారట.


అంతేకాదు హౌజ్ లో ఎలాంటి విధ్వేషాలు రాకుండా చూసుకోవాలని కంటెస్టంట్స్ కు ముందుగానే చెబుతున్నారట. ఇదిలాఉంటే కంటెస్టంట్స్ లో లేటెస్ట్ గా శ్రీముఖి జాయిన్ అయ్యిందని తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్ గా శ్రీముఖి వెళ్తుందట. అందుకే పటాస్ షోకి బ్రేక్ ఇస్తున్నానని చెప్పింది. రీసెంట్ గా జబర్దస్త్ షోలో ఆది టీం లో సర్ ప్రైజ్ ఇచ్చింది శ్రీముఖి.


ఇక శ్రీముఖితో పాటుగా వి6లో తీన్మార్ వార్తలు చెప్పే సావిత్రి కూడా బిగ్ బాస్ సీజన్ 3లో సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. బిత్తిరి సత్తితో పాటు సావిత్రి చెప్పే తీన్మార్ వార్తలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఆమెను కూడా బిగ్ బాస్ కంటెస్టంట్ గా తీసుకున్నారని తెలుస్తుంది. ఓ పక్క శ్రీముఖి మరో పక్క సావిత్రి ఇద్దరి హంగామా షోకి ప్లస్ అవుతుంది.


ఇక వీరే కాకుండా ఉదయభాను, రేణు దేశాయ్ వంటి వారు కూడా బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్స్ గా వస్తున్నారని టాక్. త్వరలో ఈ షోకి సంబందించిన అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేయనున్నారు. ఎప్పటిలానే ఎనౌన్స్ మెంట్ నాడు ప్రెస్ మీట్ లో షో హోస్ట్ మీడియా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: