ఈ మధ్య కాలంలో బాలీవుడ్ హీరోయిన్స్ కి సౌత్ లో దర్శక నిర్మాతలు బాగా అవకాశాలు ఇవ్వడమే కాదు మంచి రెమ్యునిరేషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. దాంతో ఈ బాలీవుడ్ హీరోయిన్స్ కి సౌత్ లో బాగా డిమాండ్ పెరిగిపోయింది. విద్యా బాలన్, సోనాక్షి సింహ, రాధికా ఆప్టే, రీసెంట్‌గా శ్రద్ద కపూర్, ఆలియా భట్. వీళ్ళందరు సౌత్ సినిమాలలో పెద్ద బ్యానర్లల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఇదే కోవలో అనుష్క శర్మ వచ్చి చేరారని లేటెస్ట్ న్యూస్.  


బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ మొదట్నుంచి డిఫ్రెంట్ క్యారెక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటోంది. ఇప్పటికే చాలా ఎక్స్‌పరిమెంట్స్ చేసేసింది.అందుకు ఉదాహరణలుగా పీకే, సుల్తాన్, ఎన్.హెచ్ 10, పరి, సూయి ధాగా, జీరో సినిమాలే. ఇక అనుష్క బాలీవుడ్ లో నటించిన 'పరి' సినిమాను తమిళంలో రీమేక్ చేస్తూ ఉన్నారట. తమిళంలో కూడా అనుష్కానే ప్రధాన పాత్రలో నటింపజేయాలని దర్శక నిర్మాతలు అనుకుంటున్నారట. అయితే 'పరి' సినిమా హిందీలో ప్లాప్ అన్న విషయం తెలిసిందే. 


ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది. అయితే ఈ సినిమాలో పోషించిన అనుష్క క్యారెక్టర్ కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అయినా ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తూ ఉన్నారట. అయితే ఇప్పుడు 'పరి' రీమేక్ లో కూడా అనుష్కా శర్మనే నటింపజేయాలని అనుకుంటున్నారట. ఒక ఫెయిల్ అయిన సినిమాను రీమేక్ చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నా, ఆ సినిమాలో మళ్లీ నటించేందుకు అనుష్కా శర్మ రెడీగా ఉంటుందా? అన్నది మిలియన్ డాలర్స్ ప్రశ్నగా ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: