సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో తన 26వ సినిమాగా రూపొందునున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. వరుస విజయాలు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో గీత గోవిందం భామ రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఇక మహేష్ తరువాత చేయబోయే 27 సంబంధించి ఇప్పటికే పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి. కొందరేమో అయన 27వ సినిమాని సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తారని అంటుంటే, 

మరికొందరు మాత్రం గీత గోవిందం చిత్ర దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నట్లు చెప్తున్నారు. అయితే ఈ విషయమై ఇటీవల సందీప్ రెడ్డి ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చారు. అయన మాట్లాడుతూ ఇటీవల తాను మహేష్ ను కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించానని, ఆ లైన్ లైన్ నచ్చిన మహేష్, పూర్తి స్థాయి కథ మరియు స్క్రిప్ట్ తో తనను వచ్చి కలవమని చెప్పారని అన్నారు. దీనితో మహేష్ బాబు, సందీప్ రెడ్డి కలయికలో త్వరలో సినిమా రాబోతున్న విషయం కొంత స్పష్టం అయింది. అయితే ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక వార్త అటు టాలీవుడ్ వర్గాల్లో ఇటు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. అదేమిటంటే, సందీప్, తాను చేయబోయే సినిమాలో కొద్దిరోజుల క్రితం సుధీర్ బాబు హీరోగా వచ్చిన నన్ను దోచుకుందువటే సినిమాలో నటించిన నాభ నటేష్ హీరోయిన్ ని తీసుకోవాలని యోచిస్తున్నాడట. 

ప్రస్తుతం రామ్ సరసన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న నాభ నటేష్ ను కూడా కలిసిన సందీప్, తన సినిమా కథను ఆమెకు కూడ వినిపించాడని, అతి త్వరలో మహేష్ ను కూడా కలిసి కథ కథనాలు, మరియు హీరోయిన్ తదితర విషయాలన్ని చర్చించనున్నాడట. ఇకపోతే టాలీవుడ్ లోని ఒక భారీ నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించబోతున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని ఒకవేళ నిజమే అయితే మాత్రం నాభ నటేష్ పంట పండినట్లే మరి....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: