తమిళ రాజకీయలకు, అక్కడి సినిమా స్టార్స్ కు ఎంతటి దగ్గర సంబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల మరణించిన కరుణానిధి, జయలలిత వంటి వారు సినిమా రంగం నుంచి వచ్చిన వారే. వారి కోవలోనే కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లో యాక్టివ్ అవ్వాలని అనుకున్నారు.


ఇప్పటికే కమల్ మక్కల్ నీది మయ్యం పార్టీ పెట్టీ ఎన్నికల్లో కూడా పాల్గొనగా త్వరలో రజనీకాంత్ సైతం ప్రత్యక్ష దిగనున్నారు . దీనిపై తాజాగా స్పందించిన నటుడు సత్యరాజ్ వారి ఇరువురిపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.


తమిళ రాజకీయాల్లో శూన్యత ఏర్పడిందని, రాజకీయాల్లోకి వచ్చిన కమల్-రజనీకాంత్ వలన ఎటువంటి ప్రయోజనం లేదని అయన డిఎంకె పార్టీ పెకలించాలని అనుకోవడం మూర్ఖత్వమని, రాజకీయాలు చేయడానికి చాలామంది ఉన్నారని, ఎవరి పని వారు చేసుకుంటే మంచిది అన్నారు. సత్యరాజ్ ఘాటుగా స్పందించడం ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: