నువ్వు నేను సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమిన తేజ ఆ తరువాత అనేక బెస్ట్ సినిమాలు తీశాడు.. ఆ తరువాత కొంత వెనకబడినా.. వెంటనే కోలుకొని నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా హిట్ కావడంతో మరలా తేజా లైన్లోకి వచ్చారని అనుకున్నారు. కానీ, తేజ రీసెంట్ గా తీసిన సీత సినిమా ప్లాప్ కావడంతో కెరీర్ మరలా డైలమాలో పడింది.
తేజ సినిమాల గురించి తెలుసుగాని, తేజా బాల్యం గురించి చాలా మందికి తెలియదు. బాల్యంలో ఎదుర్కొన్న సమస్యల గురించి తేజా అనేక విషయాలు చెప్పాడు. తేజా తండ్రి బిజినెస్ మెన్. తల్లి సడెన్ గా మరణించడంతో తండ్రి బెంగపెట్టుకొని మరణించాడు.
తేజా తో పాటు అక్క చెల్లి అనాథలయ్యారు. తేజా అక్క పెద్దయ్యాక పెళ్లిచేసుకుంది. చెల్లిని వేరే వాళ్ళు తీసుకెళ్లి పెంచుకోగా తేజా సోషల్ ఆర్గనైజషన్ లో పెరిగాడు. అక్కడే ఉంటూ తేజా చిన్న చిన్న పనులు చేసుకున్నాడట. అక్కడి నుంచి చెన్నై వచ్చి సినిమాల్లో చేరాడు.
కేవలం భోజనం కోసమే సినిమాల్లో చేరానని, అక్కడ ఒక్కపూట భోజనం ఉండేదని, అది తిని పనిచేసుకుంటూ బయట రోడ్డుపై పడుకునేవాడినని చెప్పాడు తేజ. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినట్టు తేజ చెప్పుకొచ్చారు.