దర్శకుడు తేజ నువ్వు నేను సినిమాతో పరిచయం అయ్యాడు.  వర్మ శివ సినిమాకు తేజ సినిమాటోగ్రాఫర్ అసిస్టెంట్ గా పనిచేశారు.  వర్మ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న తేజ.. నువ్వు నేనుతో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత మరో కొన్ని సినిమాలు చేసి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.  


అయితే, తేజా సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్న సమయంలో శ్రీవల్లి పరిచయం అయ్యింది.  ప్రేమించుకున్నారు.  అయితే, తేజా ఇంకా సినిమా ఇండస్ట్రీలో సెట్ కాలేదు.  కాబట్టి తేజాకు శ్రీవల్లిని ఇచ్చేందుకు ఇష్టం లేదట. కానీ, అక్కినేని వెంకట్ ఫ్యామిలీ వీరి పెళ్లి విషయంలో చొరవ చూపించి వివాహం చేశారు.  


వివాహం తరువాత కూడా తేజా సంసారం ఎలా ఉంది అనే విషయాలను తెలుసుకుంటూ ఉండేవారట.  తేజాకు భోజనంలో పెరుగు తప్పకుండా ఉండాలి.  పెరుగు లేకుండా తేజా భోజనం చేసేవాడు కాదు.  ఓసారి మూడు రోజులపాటు పెరుగు లేకపోయాడంతో తేజాకు కోపం వచ్చింది.  


వెంటనే తేజా కోపంతో భార్యపై చేయి చేసుకున్నాడు.  గొడవ జరిగింది.. విషయం నాలుగు గోడలు దాటి బయటకు వెళ్ళింది.  రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు జోక్యం చేసుకొని ఇద్దర్ని కలిపారట.  ఈ విషయాన్ని తేజా రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో పేర్కొన్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: