మెగాస్టార్ చిరంజీవి సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్వాతంత్ర పోరాట యోధుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితచరిత్ర కథ ఆధారంగా సైరా సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత చెర్రీ. ఈ నేపథ్యంలో ప్రొడ్యూసర్ రామ్ చరణ్ చిత్ర హక్కుల కోసం భారీ ధరలను ఖరారు చేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 90 కోట్ల వ్యాపారానికి అలాగే మొత్తం సినిమా థియేటర్ హక్కులతో కలిపి 120 కోట్లకు చెర్రీ ఫిక్స్ చేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్.


చాలా భాషల్లో ఈ సినిమాని విడుదల కాబోతున్న క్రమంలో తెలుగులో దాదాపు భారీ వ్యాపారం ఈ సినిమాపై జరుగుతున్నట్లు 200 కోట్లకు పైగా సైరా సినిమా పై బిజినెస్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం. అయితే చరణ్ కి ఎందుకు అంత ఓవర్గా ఈ సినిమాపై ఫీలవుతున్నారు అంటే దానికి కారణం స్టోరీ అని..కచ్చితంగా సైరా సినిమా చిరంజీవి కెరీర్ లోనే చరిత్రను సృష్టించే సినిమా అవుతుందని చాలా బలంగా నమ్ముతున్నారట ప్రొడ్యూసర్ చరణ్. ఇదే క్రమంలో మెగా అభిమానులు కూడా సైరా సినిమా పై విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: