మన స్టార్ హీరోస్ తాత అన్న పదాన్ని అంతగా ఉపయోగించరని అందరు అనుకుంటారు. కానీ మన టాలీవుడ్ స్టార్స్ అందరు తాత హోదాని బాగా ఎంజాయ్ చేస్తారన్న విషయం చాలా తక్కువ మందికే తెలుస్తుంది. మెగాస్టార్, బాలయ్య, మోహన్ బాబు ఇలా మన వాళ్ళు మనవలు, మనవరాలతో బాగా ఆడుకుంటారు. ఇక వాళ్ళ సినిమా షూటింగ్స్ కి వస్తే మాత్రం జరుగుతున్న షూటింగ్ ఆపి మరీ కాసేపు అలా మనవలు..మనవరాలతో గడుపుతారు. ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా అదే పని చేస్తున్నారు.


ప్రస్తుతం రజనీ దర్బార్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ముంబాయ్ మాఫియా బ్యాగ్డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని కోలీవుడ్ మీడియా సమాచారం. ఏ.ఆర్.మురగదాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా చంద్రముఖి సినిమాలో రజనీ సరసన నటించిన నయనతార ఈ సినిమాలోను సూపర్ స్టార్ రజనీకి జంటగా నటిస్తోంది. ఇక హీరోయిన్ నివేదా థామస్ రజనీ కూతురుగా నటిస్తోంది. ఇక రజని కబాలి, కాలా, పేట సినిమాలు డిజాస్టర్ అవడంతో ఈసారి దర్బార్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టాలని గట్టిగా ఉన్నాడు. అంతేకాదు మురగదాస్ కు కూడా హిట్ కావాలనే తపనతో ఉన్నాడు.


ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయి లో శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. ఈ సినిమాలో రజనీ పోలీసాఫీసర్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకముందు రిలీజ్ చేసిన రజనీ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దాదాపు 25 ఏళ్ల క్రితం 'పాండియన్' అనే సినిమాలో రజనీ పోలీస్ పాత్రలో కనిపించారు. మళ్లీ ఇంతకాలానికి పోలీస్ అధికారి పాత్రలో నటిస్తుండడం అభిమానుల్లో ఉత్కంఠ పెంచుతోంది. ఇదిలా ఉండగా రజనీ మనవడు వేద్ దర్బార్ సెట్లో అడుగు పెట్టి చిత్ర బృందాన్ని సర్‌ప్రైజ్ చేశాడు. ఆ సమయంలో తీసిన రజని..తన మనవడు వేద్ ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: