సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సునీతకు మంచి పేరుంది.  ఎంతో మందికి గాత్రాన్ని అందించింది.  వాయిస్ లో స్వీట్ ఉంటుంది కాబట్టి ఆమెకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకుంది. గుళ్ళు గోపురాలు కూడా ఎక్కువగానే తిరుగుతుంటుంది.  

ఇప్పుడు సునీత ఓ విషయంలో ఫైర్ అయ్యింది.  అది సింపుల్ విషయమే.  అదేమంటే... వైజాగ్ శారదాపీఠాధిపతి స్వరూపానంద స్వామిని ఇటీవల ఓ జాతీయ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది.  ఈ ఇంటర్వ్యూ లో అనేక విషయాలు చర్చకు వచ్చాయి.  ఆయన తన సొంత విషయాలను కూడా టివి ఛానల్తో పంచుకున్నారు.  ఇక తన వద్దకు చాలామంది సెలెబ్రిటీలు వస్తుంటారని, రజినీకాంత్, మెగాస్టార్ వంటి స్టార్స్, సింగర్ సునీత వంటి వాళ్ళు కూడా వస్తుంటారని అన్నాడు.  

ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద టాక్ గా మారింది.  సునీత ఎప్పుడు స్వరూపానందస్వామిని కలిసింది... అనే దానిపై కథనాలు రావడం మొదలుపెట్టాయి.  ఈ కథనాలపై సునీత స్పందించింది.. నిత్యం ఎన్నో రూమర్లు వస్తూ ఉంటాయి. కానీ వాటిపై నేను స్పందించను. అయితే కొన్నింటిపై మాత్రం తప్పకుండా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. 

అందుకే స్వరూపానంద సరస్వతి నా విషయంలో చేసిన కామెంట్ల గురించి స్పందిస్తున్నాను. ఆయన చెప్పినట్లు శారదా పీఠానికి నేను ఎప్పుడూ వెళ్లలేదు. అసలు నేనుప్పుడూ ఆయనను కలవలేదు. అలాంటప్పుడు ఆయన వద్దకు వెళ్లానంటూ నా పేరు ఎలా ప్రస్తావిస్తారు..? అది కూడా ఓ జాతీయ చానెల్ లో... అంటూ సునీతా వ్యాఖ్యలు చేయడం విశేషం.  మరి స్వరూపానంద స్వామి సింగర్ సునీత పేరును పొరపాటున పలికారా లేదంటే మరెవరైనా ఉన్నారో తెలియదు.  


మరింత సమాచారం తెలుసుకోండి: