తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 1 , 2 లు సక్సెస్ కావడం తో మూడో సీజన్ ను వచ్చే నెలలో మొదలు పెట్టబోతున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. మునపటి రెండు సీజన్ల కంటే చాల ఫ్రెష్ గా స్టార్ నటి నటులతో ఈ షో ఉండేలా ప్లాన్ చేసారు. 


ఈసారి హోస్ట్ గా వ్యవహరించే బాధ్యత కింగ్ నాగార్జున తీసుకున్నాడు. ఇక పార్టిసిపెంట్ల విషయంలో కూడా క్రేజ్ వారిని ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలువురి పేర్లు బయటకు రాగా..తాజాగా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ పేరు అలాగే సీనియర్ హీరో వేణు ను సంప్రదించినట్లు తెలుస్తుంది.


షో లో పాల్గొనేందుకు వేణు కాస్త ఇంట్రస్ట్ గానే ఉన్న..బండ్ల గణేష్ మాత్రం ఓ కండిషన్ పెట్టాడట. తనకు వీలయినంత వరకు ఫోన్ అందుబాటులో వుండాలని, కుటుంబ సభ్యలతో టచ్ లో వుండే అవకాశం వుండాలని బండ్ల గణేష్ కోరినట్లు తెలుస్తొంది. అయితే బండ్ల గణేష్ కోరిక ను యాజమాన్యం తోసిపొచ్చిందట. హౌస్ లో ఉన్నన్ని రోజులు కుటుంబ సబ్యులకు దూరంగానే ఉండాలని..ఎలాంటి ఫోన్ సౌకర్యం ఉండదని చెప్పేశారట. ఆలా అయితే నాకు కుదరదని చెప్పేశాడట. ప్రస్తుతం గణేష్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అది కూడా ఓ కారణం అని..అందుకే బిగ్ బాస్ వారికి ఇలాంటి కండిషన్ పెట్టాడని అంటున్నారు.

ఇదిలా ఉండగా, బందాలన్న తో పాటు, మరో క్రేజీ కంటెస్టెంట్ కింద స్టార్ మా యాజమాన్యం కేఏ పాల్ ని సంప్రదించడం జరింగింది. మొదట సుముఖత వ్యక్తం చేసినా, ఆ తరవాత మనసు మార్చుకున్నారట పాల్ గారు. ఇప్పుడు స్టార్ మా కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదట. ఈ వార్త వెలుగులోకి  వచ్చాక నెటిజన్స్ తెగ ఫీల్ అయిపోతున్నారు. బండ్లన్న, పాల్ క్రేజీ కాంబినేషన్, వాళ్ళ పంచులు, జోకులు మిస్ ఐపోయామే అని పోస్ట్లు స్టార్ట్ చేసేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: