శ్రావ్యమైన గొంతుతో పాటు ఆకర్షణీయమైన రూపంతో ఆకట్టుకునే సింగర్ సునీతకు కోపం తెప్పించారు శారదా పీఠాదిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. దీనికి గల కారణం ఆయన దగ్గరకు వచ్చే భక్తుల్లో సునీత పేరును చేర్చడమే. వివరాళ్లోకి వెళ్తే.. ఇటీవల ఏబీఎన్ ఛానల్‌లో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్న స్వరూపనంద సరస్వతి.. తన భక్తుల గురించి తెలియజేస్తూ.. సామాన్య ప్రజలతో పాటు సినిమా ప్రముఖుల్లో కూడా తన భక్తులు ఉన్నారన్నారు. 


మెగాస్టార్ చిరంజీవి, రజినీకాంత్‌లు తన దగ్గరకు వచ్చారని.. అలానే రాజేంద్రప్రసాద్ గారి అబ్బాయి కూడా తన దగ్గరకు తరచుగా వస్తుంటారన్నారు. వీరితో పాటు సింగర్ సునీత.. వీళ్లు వాళ్లు ఇలా వస్తుంటారని.. నేను ఉన్నది ఫిల్మ్ నగర్ కాబట్టి.. సెలబ్రిటీలు వస్తుంటారు’ అంటూ చెప్పుకొచ్చారు స్వరూపానందేంద్ర సరస్వతి. 


అయితే ఈ వీడియో క్లిప్పింగ్‌ను తన ఫేస్ బుక్‌ ఖాతాలో షేర్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు సింగర్ సునీత. తరచూ రూమర్స్ వస్తుంటాయి.. అయితే అన్నింటిపైనా స్పందించలేం. కొన్నింటిపై స్పందించాల్సి ఉంటుంది. అందుకు ఈ వీడియోపై రియాక్ట్ అవుతున్నానన్నారు. ఇందులో స్వామి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి.. తన వద్దకు వచ్చిన భక్తుల పేర్లలో నా పేరు ఎందుకు చెప్పారో అర్ధం కావడం లేదు. ఆయన వ్యాఖ్యలు నాకు ఇప్పటికీ ఆశ్చర్యకరంగా ఉన్నాయి’ అంటూ తన స్పందనను తెలియజేశారు సునీత. 


మరింత సమాచారం తెలుసుకోండి: