’అర్జున్ రెడ్డి’ సినిమాతో టాలీవుడు లో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఒక చిన్న సినిమాగా మొదలై ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఆ సినిమా విజయంతో బాలీవుడు దృష్టి సందీప్ మీద పడింది.

ఇప్పుడు అదే సినిమాను హిందీలో "కబీర్ సింగ్" పేరుతో రీమేక్ చేస్తున్నారు. దానికి కూడా సందీప్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్ కి మంచి స్పందన లభించింది.  ఈ నెల 21 న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ మొత్తం ముంబయిలో జరిగింది. సందీప్ రెడ్డి తెలుగువాడు. హైదరాబాదు వాసి కాబట్టి ప్రతీసారి ఈ సినిమా డిస్కషన్స్ కోసం ముంబయి వెళ్ళల్సి వచ్చేది.ఇలా ప్రయాణాలు చేస్తుంతే ఫోకస్ తగ్గుతుందని భావించిన నిర్మాతలు వెస్ట్ ముంబయి ఒక ఫ్లాట్ రెడీ చేసి ఇచ్చారట.

ఈ సినిమా జరిగినన్ని రోజులు సందీప్ రెడ్డి వంగా ముంబయిలోనే ఉన్నాడు. ఆ జ్ఞాపకాలని గుర్తుచేసుకుంటూ, ముంబయి తనకు చాలా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు.  



మరింత సమాచారం తెలుసుకోండి: