ప్రభాస్ తన కెరియర్ లో బాహుబలి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు సాహో సినిమా ని. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా గా చరిత్ర సృష్టించింది. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రొఫెషనల్ ఫైటర్లు పనిచేశారట. అంతే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు చాలామంది ఈ సినిమాలో పనిచేయటం విశేషం.


తెలుగు తమిళం హిందీ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా లో ప్రభాస్ పక్కన హీరోయిన్ గా శ్రద్ధా కపూర్ నటించింది. అయితే తాజాగా ప్రభాస్ సాహో సినిమా టీజర్ విడుదల జూన్ 13వ తారీఖున నేపథ్యంలో ప్రభాస్ అభిమానులు టీజర్ కోసం ఎంతో ఇంట్రెస్టింగ్ గా వెయిట్ చేస్తున్నారు. మరోపక్క కింగ్ నాగార్జున కూడా తన కెరియర్ లో నటించిన మన్మథుడు 2 సినిమా టీజర్ కూడా అదే రోజు విడుదల చేస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సందడి నెలకొంది.


గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించిన మన్మధుడు సినిమా సీక్వెల్ గా వస్తున్న మన్మధుడు 2 సినిమా ని రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించారు. ఇటీవల నాగార్జున - అమల జంట పెళ్లి రోజును పురస్కరించుకుని ఈ ప్రకటన చేయడం ఆసక్తికరం. 13 జూన్ మధ్యాహ్నం ఒంటి గంటకు కింగ్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ ఉంటుందని ఓ పోస్టర్ ని రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో నాగార్జున క్రౌన్ ధరించిన రియల్ కింగ్ అవతారంలో కనిపించడం ఆసక్తిని పెంచింది. మొత్తం మీద టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రభాస్ తో పాటు నాగార్జున కూడా తన సినిమా టీజర్ ని జూన్ 13వ తారీఖున విడుదల చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: