మహేష్ బాబు భార్య నమ్రత గతంలో సినిమా హీరోయిన్ గా బాలీవుడ్ ఇండస్ట్రీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లోనే అనేక సినిమాలు చేయడం జరిగింది. అయితే ఎప్పుడైతే మహేష్ బాబు ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది అప్పటి నుండి సినిమాలకు దూరమైన నమ్రతా శిరోద్కర్ మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన విషయాలను పట్టించుకుంటూ బిజీ బిజీగా గడిపారు.


ఒకపక్క తల్లిగా పిల్లలను చూసుకుంటూ మరోపక్క భార్యగా మహేష్ బాబు సినిమా వ్యవహారాలను చూసుకున్నా నమ్రతా శిరోద్కర్ తాజాగా ప్రొడ్యూసర్ అవతారమెత్తింది. సూపర్ స్టార్ కి సంబంధించిన బ్యానర్ లు ప్రస్తుతం యాక్టివ్ గా లేవు. మహేష్ బాబు, నమ్రత కలిసి 'జి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్' బ్యానర్ పై సినిమాలు తీయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో అడివి శేష్ హీరోగా ఓ సినిమా అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. అనీల్ రావిపూడి- మహేష్ కాంబోలో వస్తోన్న 'సరిలేరు నీకెవ్వరు' సినిమాకి కూడా నిర్మాణంలో భాగం తీసుకుంది.


అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో ఈ బ్యానర్ ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఈ బ్యానర్ కోసం హైదరాబాద్ లో ఓ లగ్జరీ ఆఫీస్ కూడా తీసుకున్నారు. ముఖ్యంగా ఈ బ్యానర్ యొక్క ఉద్దేశం కొత్త తరం టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ పెట్టినట్లు ఫిలింనగర్ టాక్. అంతేకాకుండా ఈ బ్యానర్ పై వెబ్ సిరీస్ కూడా తీయడానికి నమ్రత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మొత్తం మీద మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ప్రొడ్యూసర్ గా రంగంలోకి దిగడంతో ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంచలనం అయ్యింది.



మరింత సమాచారం తెలుసుకోండి: