మెగా హీరో వరుణ్ తేజ్ ఇటీవల వచ్చిన తొలిప్రేమ, ఎఫ్2 సినిమాలతో మంచి విజయాలు అందుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం అయన గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్లు సమాచారం. ఇకపోతే కాసేపటి క్రితం వరుణ్ ప్రయాణిస్తున్న కారు తెలంగాణ ప్రాంతంలోని కొత్త కోట వద్ద ప్రమాదానికి గురైనట్లు సమాచారం. 

నిజానికి ప్రమాదం ఎలా జరిగింది, ఆ సమయంలో వరుణ్ తో పాటు ఎవరున్నారు, అయన ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కొన్ని మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఆయనకు ప్రమాద సమయంలో పెద్దగా గాయాలేవి కాలేదని, అయితే ప్రమాద సమయంలో వరుణ్ కారు మాత్రం పూర్తిగా ధ్వంశం అయినట్లు చెపుతున్నారు. నిజానికి జరిగినది పెద్ద ప్రమాదమేనని, అయితే ఆ సమయంలో కారు నుండి వరుణ్ చాకచక్యంగా తప్పించుకోవడంతో ఆయన సురక్షితంగా బయటపడడం జరిగిందని అంటున్నారు. ఇకపోతే ప్రమాద సమయంలో కార్ నడుపుతోంది వరుణా లేక మరెవరైనా డ్రైవరా అనేది కూడా తెలియాల్సి ఉంది. 

ఇక ప్రమాద విషయం తెలియగానే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ సహా అయన కుటుంబసభ్యులందరూ ఎంతో కంగారు పడ్డారని, కానీ తనకు పెద్దగా ప్రమాదమేమీ జరుగలేదని వరుణ్ వారికి చెప్పడంతో అయన కుటుంబసభ్యులు కొంత కుదుటపడ్డారట. ఇక ఈ విషయం తెలియడంతో టాలీవుడ్ లోని ప్రముఖులు కొందరు వరుణ్ కు ఏమి జరిగింది అనే దానిపై ఆయనకు విపరీతంగా ఫోన్స్ చేస్తున్నారని సమాచారం. ఏదైతే ఏమయినప్పటికీ, దేవుడి దయవల్ల ప్రమాదం నుండి వరుణ్ బయట పడడం అదృష్టమని అయన కుటుంబ సభ్యులు మరియు మెగా అభిమానులు అంటున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి: