మహానటి తర్వాత కీర్తి సురేష్ తమిళంలో బాగా బిజీ బిజీగా సినిమాలు చేస్తూ ఉన్నారు కానీ తెలుగులో మాత్రం చేయనేలేదు. అయితే లేట్ అయినా లేటెస్ట్ అన్నట్టుగా కంటిన్యూస్‌గా తెలుగులో సినిమాలు మొదలు పెట్టేశారు. రీసెంట్‌గా నాగ్ మన్మథుడు-2లో షూటింగ్ కంప్లీట్ చేసిన కీర్తి ఇప్పుడు సూట్‌కేసు సర్దుకుని యూరప్‌లో ల్యాండ్‌ అవడానికి రెడీ అవుతున్నారు. నరేంద్రనాథ్‌ దర్శకత్వంలో కీర్తీ సురేశ్‌ ప్రధానపాత్రలో ఓ ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్‌ రూపొందుతున్న సంగతి తెలిసిందే. 


మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ ఈ నెల 13న స్పెయిన్‌లో ప్రారంభం కానుంది. ‘‘దాదాపు యాభైమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌తో పాటుగా వెయ్యికిలోల లగేజ్‌తో యూరప్‌ బయలుదేరారు. ఈ నెల 13న స్పెయిన్‌లో షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. ఈ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ 90శాతం పూర్తవుతుంది. త్వరలోనే టైటిల్‌ని అనౌన్స్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు చిత్రబృందం.  ఇక ఈ సినిమాని విజయదశమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 


కీర్తీసురేశ్‌ తో పాటు ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సీనియర్‌ నరేశ్, నదియా, కమల్‌ కామరాజు, భానుశ్రీ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు నగేశ్‌ కుకునూరు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న కీర్తీసురేశ్, బాలీవుడ్‌లో అజయ్‌ దేవగణ్‌ నటించనున్న ఓ స్పోర్ట్స్‌ బయోపిక్‌లో కీర్తీ సురేశ్‌ హీరోయిన్ గా ను నటించనున్నారు. అంతేకాకుండా నితిన్ సరసన కూడా ఓ సినిమాలో నటించబోతోందని మరో లేటెస్ట్ న్యూస్.


మరింత సమాచారం తెలుసుకోండి: