యంగ్ రెబల్స్టార్ నటిస్తున్న యాక్షన్ చిత్రం 'సాహో' టీజర్ ఈ ఉదయం విడుదల కాగా, టాలీవుడ్ సెలబ్రిటీలు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ కి తగ్గకుండా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఈ టీజర్ చెబుతోంది.
ఇక దీన్ని చూసిన టాలీవుడ్ ప్రముఖులు పూరీ జగన్నాథ్, సుధీర్ బాబు, సురేందర్ రెడ్డి, నితిన్, సాయి ధరమ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్, మారుతి, సుధీర్ వర్మ, తదితరులు పొగడ్తల వర్షం కురిపించారు. టీజరే ఇలా నిప్పులు చెరుగుతుంటే, సినిమా ఇక బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మేనని కితాబిచ్చారు. మొత్తం టీజర్ లో హీరోయిన్ శ్రద్ధ "ఇంత వయొలెంట్ గా ఉన్నారు. ఎవరు?" అనగా ప్రభాస్ చెప్పే "డై హార్డ్ ఫ్యాన్స్" అనడం హైలైట్ గా నిలిచింది.
అక్కినేని నాగార్జున యు.వి.క్రియేషన్స్కు, ప్రభాస్కు సాహో అని తన ట్విటర్ ద్వారా తెలిపారు. దగ్గుబాటిరానా ఎంతో అద్భుతమైన టీజర్ అన్నారు. అల్లు శిరీష్ భారతదేశంలోనే అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ అని ప్రతీ యాక్షన్ సీన్ హాలీవు్ సినిమాని తలపించేలా ఉన్నాయన్నారు. మరో చారిత్రాత్మక చిత్రంగా నిలుస్తుందన్నారు. హీరో నితిన్ కూడా ట్వాటర్ ద్వారా సాహో యూనిట్ అందరికి కంగ్రాట్స్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ నుంచి ఫంటాస్టిక్ టీజర్ మరియు టీం అందరికి ఆల్ ద బస్ట్ అన్నారు. ప్రభాస్కు మిల్కీబ్యూటీ బెస్ట్ విషెస్. దర్శకుడు గోపిచంద్ మలినేని విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయని అన్నారు. హీరో శ్రీవిష్ణు చాలా బ్రిలియంట్ టీజర్ రిలీజ్ డేట్ ఆగస్ట్ 15 కోసం డై హార్డ్ ఫ్యాన్స్ వెయిట్చేస్తున్నారన్నారు. యంగ్ క్రేజీ హీరో విజయదేవరకొండ బిగ్స్క్రీన్ మీద చూడడానికి చాలా ఎగ్జైట్గా ఉన్నానని అన్నారు. ఎంతో మంచి మాసివ్ బ్లాక్బస్టర్ని అందిస్తున్నందుకు యు.వి.క్రియేషన్స్కు థ్యాంక్స్ అన్నారు. గీతాఆర్ట్స్ కూడా ట్విటర్ ద్వారా ప్రభాస్కు, యు.వి. క్రియేషన్స్కు విషెస్ తెలియజేసింది.