మారుతి ముందు నుంచి ఒక వెరైటీ కాన్సెప్ట్స్ తో సినిమాలు తీస్తు హిట్లు కొడుతున్నాడు. మధ్య మధ్యలో కొన్ని ఫ్లాప్స్ పలకరించినా ఫర్వాలేదంటు ఎప్పటికప్పుడు యూత్ కి బాగా నచ్చే కనెక్ట్ అయ్యే కాన్సెప్ట్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇంతకముందు మతిమరుపు .. ఓసీడీ అనే కాన్సెప్ట్స్‌తో సినిమాలు తీసి ఆకట్టుకున్నాడు. నాని- భలే భలే మగాడివోయ్ మతిమరుపు నేపథ్యంలో వచ్చి బ్లాక్ బస్టర్ కొడితే .. శర్వా-ఓసీడీ కాన్సెప్ట్స్‌తో తో తీసిన మహానుభావుడు ఆశించినంతగా బాక్సాపీస్ వద్ద వర్కవుటవ్వలేదు. అయితే ఈ రెండు సినిమాలకు ఎంచుకున్న పాయింట్ పై జనాల్లో ఆసక్తికరమైన చర్చ సాగింది.  


ప్రస్తుతం సాయిధరమ్ హీరోగా తీస్తున్న సినిమాకి మారుతి ఎలాంటి కథను ఎంచుకున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. మరోసారి మారుతి ఎంచుకున్న కథ యువతరంలో హాట్ టాపిక్ అవుతుందా అన్నది తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాలి. అయితే సినిమాలో హీరోయిన్ రోల్ గురించి ఓ న్యూస్ లీకయింది. ప్రస్తుతం యువతరంలో టిక్ టాక్ అనేది హాట్ టాపిక్. టిక్ టాక్ లో వీడియోలో షేర్ చేసే హీరోయిన్ వల్ల ఎలాంటి కామెడీ పుట్టింది? ఎలాంటి చిక్కులు వచ్చి పడ్డాయి? అన్న పాయింట్‌తో మారుతి హీరోయిన్ క్యారెక్టర్‌ను డిజైన్ చేశాడని లేటెస్ట్ న్యూస్. 

అయితే మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్లు చేసిన సాయిధరమ్ పాత్ర ఎలా ఉండబోతోంది? అతడి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే మారుతి ఆ పాత్రను తీర్చిదిద్దారా?  ఎంచుకున్న మెయిన్ థీమ్ ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక ఈ సినిమాకి ప్రతి రోజూ పండుగే అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. హీరోయిన్‌గా రెజీన పేరు వినిపిస్తున్నా వేరొక టాప్ రేంజ్ హీరోయిన్‌ని ఎంచుకోవాలన్న ఆలోచన మారుతికి ఉందట. 2020 సంక్రాంతికి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. గీతా ఆర్ట్స్2- యు.వి క్రియేషన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: